తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలంటూ భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిర్భయ దోషుల కుటుంబసభ్యులు లేఖ రాశారు. లేఖ రాసిన వారిలో దోషుల తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు ఉన్నారు. మన దేశంలో పెద్ద పెద్ద తప్పులు చేసిన వారికి కూడా క్షమాభిక్షను ప్రసాదించారని మా వాళ్ళను ఉరి తీస్తే మా కుటుంబం రోడ్డున పడుతుందని లేఖలో వారు పేర్కొన్నారు. ప్రతీకారం అనేది అధికారానికి నిర్వచనం కాదని… క్షమించడంలో కూడా అధికారం ఉందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నలుగురు దోషులు చట్టంలో ఉన్న అన్ని లోసుగుల ద్వారా పెట్టుకున్న క్షమాభిక్షలను రాష్ట్రపతి ఇప్పటికే తిరస్కరించారు.