• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ఆ రెండు పార్టీలపై అప్రమత్తం.. ముస్లింలకు నితీష్ ‘దిశానిర్దేశం’

ఆ రెండు పార్టీలపై అప్రమత్తం.. ముస్లింలకు నితీష్ ‘దిశానిర్దేశం’

Last Updated: January 3, 2023 at 2:40 pm

2024 ఎన్నికల్లో బీజేపీ, మజ్లీస్ పార్టీల పట్ల ముస్లిములు అప్రమత్తంగా ఉండాలని బీహార్ సీఎం, జేడీ-యు అధినేత నితీష్ కుమార్ హెచ్చరించారు. ముస్లింల ఓటు బ్యాంక్ చీలకుండా చూసేందుకు ఆయన ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ, ఎంఐఎం రెండూ మత సామరస్యాన్ని భంగపరచడానికి యత్నిస్తాయని ఆయన ఆరోపించారు.

'Remain united to defeat BJP in 2024 Lok Sabha elections': Nitish to opposition - Hindustan Times

నిన్న తన అధికారిక నివాసంలో ముస్లిం నాయకులతో సమావేశమైన ఆయన.. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ ‘చురుగ్గా’ పావులు కదుపుతుందని, అందువల్ల విచ్చిన్న శక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లీస్ పార్టీని ఆయన బీజేపీ..’బీ’టీమ్ పార్టీగా అభివర్ణించారు. మతసామరస్యాన్నిభంగపరిచేలా ఒవైసీ విద్వేష పూరిత ప్రసంగాలు చేసే ప్రమాదం ఉందని నితీష్ కుమార్ అన్నారు.

2020 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం.. పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టిందని, దాంతో ముస్లిం ఓట్లు చీలిపోయాయని ఆయన గుర్తు చేశారు. చీలిపోయిన ఓటు బ్యాంక్ కారణంగా 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించవచ్చునన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు నితీష్ కుమార్ యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్, ఎన్సీపీ, ఆప్, జేడీ-యు సెక్యులర్, సీపీఎం పార్టీలను కలుపుకుని పోయేందుకు ఆయన కొన్ని నెలల క్రితం నుంచే యత్నాలు ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో విపక్ష ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉంటారని లోగడ ప్రతిపక్ష నేతలు ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇలా నిలబెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇటీవల కోరారు. ఇందుకు తనకు అభ్యంతరం లేదని నితీష్ కుమార్ అప్పుడే ప్రకటించారు.

Primary Sidebar

తాజా వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు షాక్..!

యువకున్ని కొట్టిన ఎస్ఐ… అడ్డుకున్న మాజీ కలెక్టర్….!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నం…!

రాహుల్‌ను కాపీ కొట్టిన మాజీ ముఖ్యమంత్రి….!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

సాహితీ ఇన్ ఫ్రా మోసాలన్నింటిని ఒకే కేసుగా పరిగణించండి..!

పోలీసుల నోటీసులకు బండి భగీరథ్ రిప్లై…!

కేసీఆర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా..!

ముగిసిన జమున అంత్యక్రియలు

అందుకే తేజస్వీ యాదవ్‌ను సీఎంగా నితీశ్ ఎంచుకున్నారు…!

ఖమ్మం కయ్యం.. కౌంటర్ ఎటాక్స్ తో హీట్ 

ఫిల్మ్ నగర్

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

ముగిసిన జమున అంత్యక్రియలు

ముగిసిన జమున అంత్యక్రియలు

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

బాలయ్యకు ఎన్టీఆర్ ఫోన్

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

నిలకడగా తారక్ ఆరోగ్య పరిస్థితి

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap