• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » పీఎం అభ్యర్థిగా రాహుల్ .. అభ్యంతరం లేదంటున్న నితీష్ కుమార్

పీఎం అభ్యర్థిగా రాహుల్ .. అభ్యంతరం లేదంటున్న నితీష్ కుమార్

Last Updated: January 1, 2023 at 8:06 pm

2024 ఎన్నికల్లో విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తే అభ్యంతరం లేదని బీహార్ సీఎం, జేడీ-యు చీఫ్ నితీష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో తమ మిత్ర పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉందని, అందువల్ల రాహుల్ ని పీఎం అభ్యర్థిగా చేస్తే తమకు సమస్యయేమీ లేదని ఆయన చెప్పారు. ఈ పదవిని తాను ఆశించడంలేదని పునరుద్ఘటించారు.

No problem if Congress pitches for Rahul Gandhi as PM candidate, says Bihar CM Nitish Kumar

అయితే ఈ కొత్త ప్రత్ఝిపాదనపై భావ సారూప్యం గల పార్టీలన్నింటిలో ఏకాభిప్రాయం వ్యక్తం కావలసి ఉందన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ ప్రధాన మంత్రి అభ్యర్థి అని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇదివరకే ప్రకటించారు. దీనిపై ఆ పార్టీయే అన్ని పార్టీలను కలుపుకుని పోవలసి ఉంటుందని, ప్రస్తుతం ఆ పార్టీ (కాంగ్రెస్) భారత్ జోడో పాద యాత్రలో బిజీగా ఉందని నితీష్ కుమార్ అన్నారు.

ఇదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఒక్క తాటిపైకి తేవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సుమారు 5 నెలల క్రితం బీజేపీతో కటీఫ్ చెప్పిన ఈ నేత.. ప్రపంచ చరిత్రలో ఎవరూ రాహుల్ మాదిరి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టలేదన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం లా మరే కుటుంబమూ త్యాగాలు చేయలేదన్నారు.

కమల్ నాథ్ కూడా ఇటీవలే ఇలాగే వ్యాఖ్యానించారు. రాహుల్ పీఎం అభ్యర్థి ప్రతిపాదన మెల్లగా చర్చల్లోకి వస్తోందని అంటున్నారు. మొదట కమల్ నాథ్ దీనిపై ప్రస్తావించగా.. తాజాగా నితీష్ కుమార్ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో జేడీ-యు వర్గాలు కూడా తమలో తాము ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Primary Sidebar

తాజా వార్తలు

ఇళ్లకే కాదు వాకిళ్లు,ఖాళీ స్థలాలకు పరిహారం ఇవ్వాల్సిందే

నా తండ్రి తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆర్….!

లిక్కర్ స్కాం కేసు.. ఛార్జ్ షీట్‌ లో ముఖ్యమంత్రి పేరు..!

రొంపిచర్ల కాల్పుల ఘటనలో నలుగురి అరెస్ట్….!

ఆ పార్టీల మధ్య దూరం పెరుగుతోందా… ఆ పోస్టర్ దేనికి సంకేతం…!

దేవుడు చెప్పాడని డైవర్స్ కి అప్లై చేసాడో మహానుభావుడు…!

మళ్లీ చెడిందా..? రేవంత్ పై కోమటిరెడ్డి కంప్లయింట్..!

అదానీ వివాదం.. రేపటికి పార్లమెంట్ వాయిదా

108 రకాలతో కొత్త అల్లుడికి పసందైన విందు..!

లోకేష్ పాదయాత్ర..పలమనేరులో ఉద్రిక్తత

మోసం చేసిపోతారని ఎన్నడూ అనుకోలేదు!

సువాసనలు వెదజల్లే బాంబు.. ముట్టుకుంటే అంతే సంగతులు !

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap