ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
నామినేషన్ పత్రాలను జూలై 20న పరిశీలించనున్నారు. జూలై 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అనంతరం ఉపరాష్ట్రపతి ఎన్నికను ఆగస్టు6న నిర్వహించనున్నారు.
ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకోనున్నారు. ఎన్నికల గణంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులకు అర్హత ఉంటుంది.
మరోవైపు ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ, విపక్ష కూటములు అభ్యర్థులను ప్రకటించాయి. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఇప్పటి వరకు కూటములు అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.