హీరోగా కాకుండా భారతీయుడిగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై అడుగుపెట్టడానికి ఉత్సుకతగా ఎదురుచూస్తోన్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నాడు. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.నాటు నాటు పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్కు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ ఈ ఘనతను దక్కించుకున్న తొలి తెలుగు సినిమాగా నిలిచింది.
ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకొన్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కూడా గెలవడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నెల 13న (భారత కాలమానం ప్రకారం ) ఆస్కార్ ప్రదానోత్సవ వేడుక జరుగనుంది. ఇందులో పాల్గొనడానికి ఎన్టీఆర్, రామ్చరణ్తో పాటు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ అమెరికా వెళ్లారు.వీరు ఆస్కార్ రెడ్ కార్పెట్పై మెరవబోతున్నారు.
ఆస్కార్ వేడుకలో తొలిసారి పాల్గొననుండటంపై లాస్ ఏంజిలాస్కు చెందిన ఓ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్గానో, కొమురం భీమ్ పాత్రధారిగా కాకుండా భారతీయుడిగా రెడ్ కార్పెట్పై నడవబోతున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నాడు.
గుండెల నిండా భారతీయతను నింపుకొని రెడ్ కార్పెట్పై అడుగుపెట్టే క్షణాల కోసం ఎగ్జైటింగ్గా ఎదురుచూస్తున్నానంటూ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. గత ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
#RRR star @tarak9999 will carry his "nation in [his] heart" as he walks the #Oscars red carpet this Sunday. pic.twitter.com/mwWhDvI3KZ
— Entertainment Tonight (@etnow) March 10, 2023