కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ కొత్త గరిష్ఠాలను తాకడం జరిగింది.కరోనా మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్లు దాదాపు నాన్-పార్టీసిపెంట్స్గా మిగిలిపోవడం అనేది జరిగింది.అయితే ఈ మధ్య మార్కెట్ ర్యాలీలో 2021వ సంవత్సరంలో మల్టీబ్యాగర్ స్టాక్ల జాబితాలో మంచి నెంబర్ లో రియల్ ఎస్టేట్ స్టాక్లు ప్రవేశించాయి. ఇక వీటిలో రాధే డెవలపర్స్ షేర్ ఒకటని చెప్పాలి. ఈ మల్టీబ్యాగర్ రియల్ ఎస్టేట్ స్టాక్స్. ఇది గత ఆరు నెలల్లో అప్పర్ సర్క్యూట్ను తాకడం జరిగింది. గత వారంలో రాధే డెవలపర్స్ షేర్ ధర రూ.309.60 నుంచి రూ.338లకు పెరిగింది.అలాగే ఈ కాలంలో దాదాపు 9 శాతం పెరుగుదలను నమోదు చేయడం జరిగింది. గత నెలలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ దాదాపు రూ.190 నుండి రూ.338కి పెరిగింది. అలాగే ఈ కాలంలో 77 శాతం పెరిగింది.
అదేవిధంగా గత ఆరు నెలల్లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 10.40 నుండి రూ.338కు చేరుకుంది. ఈ కాలంలో దాదాపు 3,150 శాతం పెరుగుదలను నమోదు చేయడం జరిగింది.రాధే డెవలపర్స్లో ఒక పెట్టుబడిదారుడు ఒక వారం క్రితం రూ. లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, దాని విలువ ఇప్పుడు ఈరోజు 1.09 లక్షలకు చేరుతుంది. అదేవిధంగా ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పటి రూ. 1.77 లక్షలకు చేరేది. అలాగే ఒక పెట్టుబడిదారుడు ఆరు నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లైతే దాని విలువ ఇప్పుడు రూ.32.50 లక్షలకు చేరడం జరిగింది.