డి.ఆర్.ఐ పేరుతో డీల్ చేసిన ‘ఆపురేషన్ గోల్డెన్ డాన్ ’విజయవంతంమైంది. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు అధికారులు.
615 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని పసుపు రంగు పేస్ట్ రూపంలో హ్యాండ్బ్యాగ్లో దాచి హైదరాబాద్ నుంచి ముంబైకి బస్సులో బయల్దేరిన ఇద్దరు మహిళలను డి.ఆర్.ఐ అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా జరిగిన పలుదాడులలో వివిధ అక్రమ రవాణా ముఠాలపై దాడి చేసారు అధికారులు.
”ఆపరేషన్ గోల్డెన్ డాన్” పేరుతో పాన్ ఇండియా ఆపరేషన్ చేపట్టారు డీఆర్ఐ అధికారులు. ఈ ఆపరేషన్లో రూ.1.35 కోట్లకు పైగా విలువైన భారతీయ, విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో ఏడుగురు సూడాన్ జాతీయులతో సహా 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు భారతదేశానికి చెందినవారిగా గుర్తించారు. పట్టుబడిన సైఫ్ సయ్యద్ ఖాన్, షంషేర్ ఖాన్, మనీష్ ప్రకాష్ జైన్ లను భారతీయులుగా గుర్తించారు. మిగిలిన వారిని సూడాన్ జాతీయులుగా గుర్తించారు.
డీఆర్ఐ ఆపరేషన్లో రూ.1.35 కోట్లకు పైగా విలువైన భారతీయ, విదేశీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని ఎక్కువగా పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
దీనిని ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా పాట్నాకు తీసుకొచ్చారు. దీని తర్వాత రైళ్లలో లేదా విమానంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించారు. పెద్ద ఎత్తున ముంబైకి తీసుకెళ్లారు.
ముగ్గురు సూడాన్ జాతీయులను అధికారులు పట్టుకున్నారు. పాట్నా రైల్వే స్టేషన్లో ముంబై వెళ్లే రైలు ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నారు. 35 కోట్లకు పైగా విలువైన భారతీయ, విదేశీ కరెన్సీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
బంగారం పేస్ట్లో 37.126 కిలోల బంగారం ఉన్నట్లు అధికారి తెలిపారు. దానిని 40 ప్యాకెట్లలో దాచి ఉంచారు. స్లీవ్లెస్ జాకెట్తో ప్రత్యేకంగా తయారు చేసిన జేబులో దాచిపెట్టిన ఇద్దరు సూడాన్ జాతీయుల నుంచి బంగారం పేస్ట్ని స్వాధీనం చేసుకున్నారు.