పార్లమెంట్ లో బుధవారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. పార్లమెంట్ లో బుధవారం కూడా వాయిదాలు, సభ్యుల సస్పెన్షన్ ల పర్వం కొనసాగింది. ఇరు సభల్లోనూ కేంద్రంపై విపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఇప్పటికే 24 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడగా, తాజాగా మరో రాజ్యసభ ఎంపీపై బుధవారం వేటు పడింది.
ఆప్ నేత సంజయ్ సింగ్ ను అనుచిత ప్రవర్తన కారణంగా సస్పెండ్ చేశారు. ఎంపీలపై సస్పెన్ష్ వేటును విపక్షాలు తప్పుపట్టాయి. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశాయి.
సస్పెన్షన్ ఎదుర్కొంటున్న 20 మంది రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. 50 గంటలపాటు ఈ ఆందోళనలు ఇలానే కొనసాగిస్తామంటూ ఎంపీలు వెల్లడించారు.
గత రెండు రోజుల్లో 20 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. వారిలో టీఎంసీకి చెందిన ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెరాస చెందిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ ఆమ్ఆద్మీల నుంచి చెరో ఎంపీ ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఒక రాజు అని ఆయ అన్నారు. అందుకే 57 మంది ఎంపీలను, 25 ఎంపీలను మోడీ సస్పెండ్ చేయించారన్నారు. ప్రశ్నలకు భయపడే మోడీ ఇలా చేశారని అన్నారు.
రాజ్యసభలో ఎంపీల సస్పెన్ష్పై ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో విపక్ష నేతలు భేటీ అయ్యారు. సభ్యులపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. సభ్యులు చేసిన తప్పును ఒప్పుకుంటేనే సస్పెన్షన్ తొలగిస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య స్పష్టం చేశారు.
ధరల పెంపుపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని వెంకయ్యకు వారు కోరారు. వరుస సస్పెన్ష్లతో సభలో గందరగోళం కొనసాగగా సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం సెషన్లో రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది.
మరోవైపు లోక్సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అగ్నిపథ్, ధరల పెంపు, జీఎస్టీ మొదలైన అంశాలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. ఇకపై నిరసనలు చేపట్టబోమని హామీ ఇవ్వాలని అలా అయితేనే ఉపసంహరణ చర్యలు చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.