• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » సస్పెన్షన్ పై విపక్షాల ఫైట్… ఆ షరతులకు ఒప్పుకుంటేనే..!

సస్పెన్షన్ పై విపక్షాల ఫైట్… ఆ షరతులకు ఒప్పుకుంటేనే..!

Last Updated: July 27, 2022 at 9:11 pm

పార్లమెంట్ లో బుధవారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. పార్లమెంట్ లో బుధవారం కూడా వాయిదాలు, సభ్యుల సస్పెన్షన్ ల పర్వం కొనసాగింది. ఇరు సభల్లోనూ కేంద్రంపై విపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఇప్పటికే 24 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడగా, తాజాగా మరో రాజ్యసభ ఎంపీపై బుధవారం వేటు పడింది.

ఆప్ నేత సంజయ్ సింగ్ ను అనుచిత ప్రవర్తన కారణంగా సస్పెండ్​ చేశారు. ఎంపీలపై సస్పెన్ష్​ వేటును విపక్షాలు తప్పుపట్టాయి. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్​ చేశాయి.

సస్పెన్షన్​ ఎదుర్కొంటున్న 20 మంది రాజ్యసభ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు. 50 గంటలపాటు ఈ ఆందోళనలు ఇలానే కొనసాగిస్తామంటూ ఎంపీలు వెల్లడించారు.

గత రెండు రోజుల్లో 20 మంది ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. వారిలో టీఎంసీకి చెందిన ఏడుగురు, డీఎంకే నుంచి ఆరుగురు, తెరాస చెందిన వారు ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ ఆమ్​ఆద్మీల నుంచి చెరో ఎంపీ ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఒక రాజు అని ఆయ అన్నారు. అందుకే 57 మంది ఎంపీలను, 25 ఎంపీలను మోడీ సస్పెండ్​ చేయించారన్నారు. ప్రశ్నలకు భయపడే మోడీ ఇలా చేశారని అన్నారు.

రాజ్యసభలో ఎంపీల సస్పెన్ష్​పై ఛైర్మన్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో విపక్ష నేతలు భేటీ అయ్యారు. సభ్యులపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. సభ్యులు చేసిన తప్పును ఒప్పుకుంటేనే సస్పెన్షన్​ తొలగిస్తానని ఉపరాష్ట్రపతి వెంకయ్య స్పష్టం చేశారు.

ధరల పెంపుపై సభలో చర్చకు అవకాశం కల్పించాలని వెంకయ్యకు వారు కోరారు. వరుస సస్పెన్ష్​లతో సభలో గందరగోళం కొనసాగగా సమావేశాలను గురువారానికి వాయిదా వేశారు. బుధవారం సెషన్​లో రాజ్యసభ మూడు సార్లు వాయిదా పడింది.

మరోవైపు లోక్​సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అగ్నిపథ్​, ధరల పెంపు, జీఎస్​టీ మొదలైన అంశాలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నలుగురు కాంగ్రెస్​ ఎంపీలు సస్పెన్షన్​కు గురయ్యారు. ఎంపీల సస్పెన్షన్​ ఎత్తివేయాలంటూ ప్రతిపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. ఇకపై నిరసనలు చేపట్టబోమని హామీ ఇవ్వాలని అలా అయితేనే ఉపసంహరణ చర్యలు చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి స్పష్టం చేశారు.

Primary Sidebar

తాజా వార్తలు

టికెట్‌ టెన్షన్‌.. కాంగ్రెస్‌ మల్లగుల్లాలు

కాంగ్రెస్ లో కలకలం.. పాల్వాయి స్రవంతి ఆడియో లీక్

వృద్దులు రాత్రి సమయాల్లో ఎందుకు ఎక్కువగా మరణిస్తారు…?

ఆల్కాహాల్ తాగే వారు బరువు ఎందుకు పెరుగుతారు…?

ఈడీ లిస్ట్..టార్గెట్ 19 !

హజరుకాని మంత్రి.. నాంపల్లి కోర్టుకు బదిలీ!

ఫీల్డ్ అసిస్టెంట్లకు శుభవార్త.. !

రాక్షసులు శివుడ్ని ఎందుకు పూజించేవారు…?

అది ఒరిజినల్ వీడియో కాదు… క్లారిటీ ఇచ్చిన ఎస్పీ..!

ఆడవారికి గుండెపోటు ఎందుకు తక్కువ…?

బ్లాక్ మ్యాజిక్ ద్వారా ప్రజల మద్దతు పొందలేరు..!

పెళ్ళిలో బాసికం ఎందుకు కడతారు…?

ఫిల్మ్ నగర్

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

పూర్ణ హగ్..ఇంతకీ అతనెవరంటే

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

దయచేసి క్షమించండి..బాయ్‌ కాట్‌ పై అమీర్‌ రియాక్షన్‌!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

బ్లాక్ పింక్ వారి బోర్న్ పింక్ వ‌చ్చేస్తోంది!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

జ‌ర జాగ్ర‌త్త‌గా మాట్లాడండి!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

వాటి నుంచి విశ్రాంతి తీసుకోవాల‌నుకుంటున్నా!!

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ట్రేడ్ టాక్.. బాక్సాఫీస్ ను డామినేట్ చేసిన బింబి

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఐశ్వర్య రాయ్ పై బన్సాలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

హీరోయిన్ గా మాలాశ్రీ కూతురు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)