• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » రాష్ట్రపతి ప్రసంగానికి విపక్షాలు డుమ్మా

రాష్ట్రపతి ప్రసంగానికి విపక్షాలు డుమ్మా

Last Updated: January 31, 2023 at 1:30 pm

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. . . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు చేరుకున్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని పలు విపక్షాలు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్, ఆప్, బీఆర్ఎస్ వంటి పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి చేస్తున్న ప్రసంగం. అయితే కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, ఇతర విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి గైర్ హాజరు కావడం పార్లమెంటు పట్ల ఈ దేశం పట్ల వారు చూపుతున్న అగౌరవానికి నిదర్శనమని బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా తప్పు పట్టారు.

BRS and AAP to boycott Presidential address | Y This News

శ్రీనగర్ లో వాతావరణం బాగులేని కారణంగా విమానాలు ఆలస్యం కావడం వల్ల అక్కడినుంచి తమ నేత ఖర్గే, ఇతర నాయకులు పార్లమెంటుకు హాజరు కాజాలరని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ ప్రకటించిన అనంతరం.. అమిత్ మాలవీయ స్పందిస్తూ.. నిన్న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో బిజీగా ఉన్న ఆ పార్టీ నేతలు నేడు పార్లమెంటుకు రాలేకపోతున్నామని చెబుతున్నారని, ఇది రాజ్యాంగ విలువలపట్ల వారికి గౌరవం లేదని సూచిస్తోందని అన్నారు.

బీఆర్ఎస్, ఆప్ పార్టీల తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ‘విమానాల ఆలస్యాన్ని’ సాకుగా చూపి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తోందని బీజేపీకే చెందిన మరో నేత, ఈ పార్టీ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించే అత్యున్నత వేదిక పార్లమెంట్ అని, విపక్ష ఎంపీలు ఈ సంగతి తెలుసుకోవాలని ఆయన అన్నారు.

తమరాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైనందుకు నిరసనగా తాము రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ నేత కె. కేశవరావు వ్యాఖ్యానించగా, ఆప్ కూడా ఇదే విమర్శ చేసింది. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించింది.

Primary Sidebar

తాజా వార్తలు

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ లో మరోసారి పోస్టర్ల కలకలం!

ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం మీ ప్రేమే: అల్లు అర్జున్‌!

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

ఇక నుంచి వ్యాపారం చేయాలంటే..ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్‌ తప్పనిసరి!

రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల తవ్వకాలు!

త్వరలోనే టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయాలు..పరీక్షలు ఎప్పుడంటే!

మక్కా వెళ్తుండగా ప్రమాదం..20 మంది మృతి!

అమెరికా పాఠశాలలో కాల్పులు..ఆరుగురి మృతి!

రాహుల్ పై..! ఉసేన్ బోల్ట్ ఆశ్చర్యపోయేలా..!?

‘డార్లింగ్’ అంటే తప్పా? కాంగ్రెస్ నేత సమర్ధన

కిడ్నీ వ్యాధితో మృతి చెందిన చిరుత..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

ఫిల్మ్ నగర్

bunny special thanks to fans on completing 20 years in film industry

ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం మీ ప్రేమే: అల్లు అర్జున్‌!

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు. అది తాజాగా అధికారికం అయింది అంతే..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

మళ్లీ మలయాళంలో సినిమా చేయనున్న..నివేదా..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

భార్యా,బావమరుదులపై నవాజుద్దీన్ సిద్ధిఖీ పరువునష్టం కేసు..!

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా...!?

నేను సైతం ..క్యాస్టింగ్ కౌచ్ ఎదురుర్కున్నాననంటే నమ్ముతారా…!?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు...చెప్పండి !?

మీలా ప్రేమించే వాళ్లు ఎవరున్నారు…చెప్పండి !?

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ ...!

హిందీ ‘ఛత్రపతి’ గా అలరించనున్న ‘అల్లుడుశీను’ రిలీజ్ డేట్ ఫిక్స్ …!

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

కొత్త ఫొటో షూట్ తో పిచ్చెక్కించేసిన నిహారిక

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap