మహారాష్ట్రలోని ఔరంగబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను మారుస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా వివక్షను సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
owais
దేశంలోని హిందువులు, ముస్లింలను విభజించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నామన్నారు.
పొత్తులపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో పలు పార్టీలతో చర్చలు జరపుతున్నామన్నారు. ఎవరితో పొత్తుకుంటామనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. ముస్లింలపై కొందరు ద్వేషభావాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అలాంటి వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. భారత్ జోడో యాత్రలో రాజస్థాన్ ప్రభుత్వం దేశం అంతా పాల్గొన్నదన్నారు. అల్వార్లో జరిగిన రాయల్ వెల్డింగ్లోనూ ప్రభుత్వం పాల్గొందన్నారు. కానీ జునైద్, నాసిర్లను చంపిన చోటుకు ఆ ప్రభుత్వం వెళ్లలేకపోయినట్లు అసద్ ఆరోపించారు.
తెలంగాణలో 2014, 2018 జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది డిసెంబర్లోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని అసద్ అన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని ఓడించనున్నట్లు ఆయన వెల్లడించారు.