పోలీసులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అక్కసు వెళ్లగక్కారు. పోలీసులపై గూండాగిరి ప్రదర్శించి వీరంగం సృష్టించిన సొంత పార్టీ భోలక్పూర్ కార్పొరేటర్ను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కంగుతున్న అసదుద్దీన్ పోలీసులపై ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకునే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక పోలీసులపై సెటైర్లు వేశారు. అంతేకాదు మంత్రి కేటీఆర్ , హైదరాబాద్ సీపీకి ట్యాగ్ చేశారు.
రాడిసన్ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాలుగు రోజుల వరకు స్పందించని అసదుద్దీన్.. బుధవారం కార్పొరేటర్ అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అంతేకాదు, సిటీ పోలీస్ ట్విట్టర్కు ట్యాగ్ చేస్తూ పోలీసులను హేళన చేసే విధంగా ట్వీట్ చేసారు. దర్యాప్తు తీరుపై విమర్శలు చేసారు. కొకైన్ దొరికినప్పటికీ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. ధనవంతుల పిల్లల్లో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా విడుదల చేశారని అసద్ ఆరోపించారు. చట్టం అందరికీ సమానమేనన్న ఆయన… పేదలు, ధనవంతులందరికీ చట్టం సమానంగా ఉండాలని హితవు పలికారు.
మరోవైపు భోలక్పూర్ ఘటన మరవకముందే ఎంఐఎంకు చెందిన మరో కార్పొరేటర్ తాజాగా పోలీసులపై జులుం ప్రదర్శించాడు. యునాని హాస్పిటల్ వద్ద పార్కింగ్ సమస్యను పరిశీలించడానికి వచ్చిన ఎస్సై పై గూండాగిరి ప్రదర్శించాడు.
మొత్తం మీద తాము ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో అందరిపైనా ఇష్టారాజ్యంగా రుబాబు ప్రదర్శించిన ఎంఐఎం నేతలకి.. కార్పొరేటర్ అరెస్ట్ ఒక గట్టి షాక్ ఇచ్చింది. అందువల్లే అసహనంతో రగిలిపోతున్నారని పోలీసులను ఏదో విధంగా ఇబ్బంది పెట్టే చర్యలకు పాల్పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Rule of law is supreme Art 13 & it is very unfortunate that cocaine was found in this “Rave party” and all offspring’s of Rich kids where released not a single arrest apart from the owner of the place
Law should be applied equally to poor & rich @CPHydCity @KTRTRS https://t.co/WehHaS5BTK— Asaduddin Owaisi (@asadowaisi) April 6, 2022
Advertisements