పాకిస్తాన్ పాస్ట్ బౌలర్, అద్భుమైన ఫాంలో ఉన్న పేసర్ మహ్మద్ అమీర్ తన అంతర్జాతీయ ఆటకు గుడ్ బై చెప్పాడు. తన వయస్సు దృష్ట్యా రిటైర్మెంట్ తీసుకుంటే వార్తల్లో నిలిచే వారు కాదు కానీ తను తన టీం మేనెజ్మెంట్ కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
2019లోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్… పరిమిత ఓవర్ల ఆటలో కొనసాగుతున్నారు. ఇటీవల శ్రీలంక క్రికెట్ లీగ్ లో 11వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనపర్చాడు. లీగ్ లో టాప్ వికెట్ టేకర్స్ లో ఒకరిగా నిలిచాడు. కానీ న్యూజిలాండ్ తో సిరీస్ కు పాక్ బోర్డు 35మందిని ఎంపిక చేయగా, అందులో అమీర్ స్థానం కల్పించలేదు. దీంతో ఇక తన వల్ల కాదు వీరి కింద ఆడటం అంటూ ఆటకు గుడ్ బై చెప్పేశాడు.
ఈ బోర్డు వల్ల తను మానసికంగా కృంగిపోతున్నానని, ఇక ఆడటం నా వల్ల కాదు అంటూ వీడియో రిలీజ్ చేశాడు.
Here is Pakistani fast bowler @iamamirofficial announcing retirement from international cricket as protest against Pak team management’s behaviour. he was talking to me pic.twitter.com/TMC2LDEZHb
— Shoaib Jatt (@Shoaib_Jatt) December 17, 2020
Advertisements