కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులపై ప్రకటన చేసింది. ఈమధ్యే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ కు పద్మ విభూషణ్ ను ప్రకటించింది.
టెక్ దిగ్గజాలు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య, పద్మజారెడ్డి, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి.
ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు, సుంకర వెంకట ఆదినారాయణ, షేక్ హసన్ కు పద్మశ్రీ దక్కింది.
మొత్తం నలుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కగా.. 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ వరించాయి.