• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » కర్ణాటకలో అవినీతి తిమింగలాలు

కర్ణాటకలో అవినీతి తిమింగలాలు

Last Updated: January 16, 2023 at 4:44 pm

కర్ణాటకలో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కంట్రాక్టర్లు రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే.. 40 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే..అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆ రాష్ట్ర కంట్రాక్టర్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ బాంబు పేల్చారు. చిత్రదుర్గ బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డికి తాను 2019-2022 మధ్య ముడుపులుగా రూ. 90 లక్షలు చెల్లించానని ఆయన తెలిపారు. ఇందుకు ఆధారాలుగా తమ మధ్య జరిగిన ఆడియో సంభాషణల తాలూకు వీడియోలను బయటపెడతానన్నారు. తనవద్ద వాట్సాప్ రికార్డింగులు కూడా ఉన్నాయన్నారు.

Civil contractors petition to PM against 'unprecedented' rise of corruption in Karnataka

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను చేబట్టాలంటే మొదట ఈ ఎమ్మెల్యే చేతులు తడపవలసిందే అన్నారు. సోమవారం బెంగుళూరులో మీడియాతో మాట్లాడిన మంజునాథ్.. కోవిడ్ పాండమిక్ సమయంలో ఓ ప్రాజెక్టు కోసం ఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు తాను మొదట 10 శాతం కమిషన్ ను, రెండో కోవిడ్ వేవ్ సమయంలో మరో 10 శాతం కమిషన్ ను చెల్లించానన్నారు. ఈ అధికారికి, తిప్పారెడ్డికి మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు.

పీడబ్ల్యుడీ బిల్డింగ్ నిర్మాణాన్ని తాను చేబట్టానని, కానీ మూడేళ్ళుగా ఫైనల్ బిల్లు తనకు రాలేదని ఆయన చెప్పారు. తనకెంత కమీషన్ రావాలో తిప్పారెడ్డి చేత్తో సైగలు చేసి చూపేవారన్నారు. మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో 25 శాతం కమీషన్ తీసుకున్నారని, ఇతర కాంట్రాక్టర్లు కూడా తాము లంచంగా ఎంత ముట్టజెప్పామో తనకు చెప్పారని మంజునాథ్ తెలిపారు.

ఓ ప్రాజెక్టు కోసం తనకు 40 శాతం కమీషన్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప పెట్టిన వేధింపుల కారణంగా గత ఏడాది సంతోష్ పాటిల్ అనే కంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నేపథ్యంలో మంజునాథ్ తాజాగా చేసిన ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ నేతల అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ వంటి విపక్షాలు పదేపదే దుయ్యబడుతున్నాయి. రాష్ట్రంలోని మఠాలకు గ్రాంట్లను విడుదల చేయాలంటే అధికారులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని లింగాయత్ పీఠాధిపతి ఒకరు లోగడ ఆరోపించారు.

Primary Sidebar

తాజా వార్తలు

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టిక్కెట్ అడిగినందుకు కన్నబిడ్డను ఎయిర్ పోర్ట్లో వదిలేసిన జంట..!

పెళ్ళి వేడుకలో క్రాకర్స్ కోసం కొట్టుకున్నారు..!

జొమాటో గులాబ్ జామూన్స్ రేటు చాలా ఘాటు …!

విమానయాన పరిశ్రమ నష్టాల్లో ఉంది…!

5న కేబినెట్ సమావేశం…!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

శుక్రవారం నుంచి అరెస్టులే… సీఎం సంచలన ప్రకటన…!

ప్రకంపనలు రేపుతున్న రెండో ఛార్జ్ షీట్

టైగర్ టీ బ్రేక్ … వీడియో వైరల్ !

వీర సింహారెడ్డి సినిమా ఆ టీడీపీ లీడర్ స్పూర్తితో వచ్చిందా…?

రకుల్ కి ఆ సినిమా కలిసిరాలేదా…? అందుకే టాలీవుడ్ లో కనపడటం లేదా…?

ఫిల్మ్ నగర్

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap