• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ కొత్త పథకం

సంక్షోభం నుంచి బయటపడేందుకు పాక్ కొత్త పథకం

Last Updated: January 16, 2022 at 2:52 pm

పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు నానాతంటాలు పడుతోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని అమలు చేస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది. విదేశీ పౌరులకు పాకిస్తాన్‌లో శాశ్వత నివాస పథకాన్ని అందించాలని ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ఈ నెల 15నుంచి ప్రారంభం అయింది. వీదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, వీదేశీ మార‌క‌ద్ర‌వ్య‌నిల్వలు పెంచుకోవ‌డానికి పాక్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్థాన్ చరిత్రలో రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అనుమ‌తించ‌డం ఇదే మొద‌టి సారి.

అమెరికా, కెనడా, ఆఫ్ఘన్, చైనా దేశాలే లక్ష్యంగా ఈ స్కీమ్ ను ప్రవేశపెడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ధనిక వర్గాలు టర్కీ, మలేషియాకి వెళ్లిపోతున్నారు. వారిని ఆకర్శించడానికే ఈ ఇమ్రాన్ ఈ పథకం తీసుకొచ్చారని అంటున్నారు. పాక్ లోనే వారికి శాశ్వత నివాసం కల్పిస్తే దేశ ఆర్థిక వృద్దిలో వారు భాగం అవుతారని పాక్ ప్రభుత్వం ఆలోచన.

మరోవైపు కెన‌డాలో ఉన్న సిక్కుల‌ను కూడా ఈ పథకం ద్వారా పాక్ ఆక‌ర్షించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొంద‌రు సిక్కులు మతపరమైన ప్రదేశాలలో, ముఖ్యంగా కర్తార్‌పూర్ కారిడార్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ఆక‌ర్షించే ల‌క్ష్యంగా పాక్ ఈ ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టింద‌నే వాద‌న‌లు ఉన్నాయి.

పాకిస్తాన్‌లో పారిశ్రామిక యూనిట్లను చైనాకు అప్ప‌గించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే వాద‌న కూడా లేకపోలేదు. చైనాలో ఉన్న కొంతమంది దనిక వర్గాల ప్రజలను ఈ పథకం ద్వారా పాక్ లోకి ఆహ్వానించి వారి ప్రాముఖ్య‌త‌ను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం అనుకున్నట్టు ఈ పథకం ద్వారా విదేశీయులను ఆకర్షిస్తే పాక్ కొంత మేర మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కేటీఆరే నెంబ‌ర్ వ‌న్.. నెట్టింట కుంప‌టి పెట్టిన ఫోటో..!

అప్పులు చేస్తాం.. వివరాలు చెప్పం!

చేతగాని ముఖ్యమంత్రి అవసరమా?

పంబన్ బ్రిడ్జి.. కొత్త అంగుల‌తో నిర్మాణం..!

కరోనా భారత్ లోనే పుట్టింది.. శ్రీరాముడి జన్మస్థలం నేపాల్..!

పోడు రైతులకు పట్టాలు ఎక్కడ?

ర‌ష్యా ఆధీనంలో.. ఉక్రెయిన్ కీల‌క ప్రాంతం..!

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

అదృష్టం వ‌రించింది..చమీలీ బాయ్ మురిసింది..!

ప‌బ్ పై దాడులు.. 18 మంది అరెస్ట్..!

ఘోర రోడ్డు ప్రమాదం… ఏడుగురు మృతి..!

అవినీతి చిట్టాతో ముఖ్యమంత్రిని కలుస్తాం…!

ఫిల్మ్ నగర్

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

kgf 2 dialogues

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

సావర్కర్ బయోపిక్... అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)