రక్తం వచ్చేలా తమ కొడుకును స్కూల్ ప్రిన్సిపాల్ కొట్టాడని పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలో జరిగింది.
తుమ్మనపల్లిలోని ఏకశీలా స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న సాయి సిద్ధాంత్ ను ప్రిన్సిపాల్ రక్తం వచ్చేలా కొట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు. టీచర్ లేనప్పుడు అల్లరి చేస్తున్నాడనే కారణంతో తమ కొడుకుతో పాటు మరి కొంత మంది స్టూడెంట్స్ ను ప్రిన్సిపాల్ చితకబాదాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపాల్ ని ఎందుకు కొట్టారని నిలదీయగా.. ఏం చేస్తారో చేసుకోండంటూ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తెలిపారు.
అందుకే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ప్రిన్సిపాల్, స్కూల్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సాయి సిద్ధాంత్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.