• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు.. రాజ్యసభ వాయిదా

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు.. రాజ్యసభ వాయిదా

Last Updated: December 7, 2021 at 2:13 pm

పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. పలు అంశాలపై చర్చలు జరపాలని విపక్షాలు పట్టుబిగిస్తున్నాయి. బీజేపీ మాత్రం అవేవి పట్టించుకోకుండా సభను ముందుకు సాగించేందుకు ప్రయత్నిస్తుంది. 12 మంది ఎంపీలపై ఉన్న సస్పెన్ష్​ను తొలగించాలని విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ డిమాండ్​ చేశాయి. దీంతో రాజ్యసభ మరోసారి వాయిదా పడింది.

నేటికి 7 రోజుల నుంచి విపక్షాలు పలు అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. నాగాలాండ్ కాల్పుల ఘటనపై చర్చించాలని నిన్న విపక్షాలు డిమాండ్ చేయడంతో అమిత్ షా ఓ ప్రకటన చేశారు. అయితే, అమిత్​ షా ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్ సభలో విపక్షాలు వాకౌట్​ చేయగా.. షా ప్రకటన తరువాత రాజ్యసభ కూడా నేటికి వాయిదా పడింది.

అయితే, సమావేశాలు మొదలైన కాసేపటికే ఈరోజు కూడా రాజ్యసభ వాయిదా పడింది. అటు లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతుల మరణాలపై కేంద్రం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందంటూ విరుచుకుపడ్డారు. రైతుల మరణాలపై తమ దగ్గర డేటా లేదని ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు. 400మంది రైతులకు పంజాబ్​ ప్రభుత్వం పరిహారం ఇచ్చిందని.. 152 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చిందని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర డేటా లేకపోవడమేంటని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయలని.. ఉద్యోగాలివ్వాని డిమాండ్ చేశారు.

అటు, పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరససలు తెలిపారు. నల్ల చొక్కాలు వేసుకొని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి.. రైతులను కాపాడాలంటూ నినాదాలతో ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, టీఆర్ఎస్ ఎంపీల నిరసనలపై కేంద్రం స్పందించలేదు. దీంతో ఇరు సభలను టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

గుజరాత్ లో నేడు మోడీ పర్యటన

ఆర్సీబీకి హిట్లర్ గా మారిన బట్లర్.. ఫైనల్ ఆశలు ఆవిరి

తెలంగాణ తేజాలకు ఘన స్వాగతం

నువ్ వ‌స్తే.. నేనుండా..!

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఇల్లు అద్దెకు ఇస్తానని చెప్పి… !

బిర్యానిలో బల్లి.. ఖంగుతిన్న వినియోగదారుడు..!

మన ఊరు-మన బడి.. రా“బడి” మాత్రం మేఘాది !

బ్రేకింగ్.. లద్దాఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..!

తెలంగాణలో బీజేపీ సర్కార్..మోడీ వ్యాఖ్యలతో శ్రేణుల్లో జోష్

ఫిల్మ్ నగర్

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

udaykiran

చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ స్టార్ డైరెక్టర్స్ తో ఏం మాట్లాడాడో తెలుసా ?

F3 Movie Review and Rating

ఫస్ట్ ఆఫ్ ఓకే…సెకండ్ ఆఫ్ కష్టం – రివ్యూ

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)