దేశంలోని రైళ్లు ఎప్పుడూ సరైన సమయానికి రావనే అపవాదు ఉంది. అయితే.. దాన్ని పోగొట్టుకోవడానికి రైల్వేశాఖ కృషి చేస్తోంది. ముందుగా రాకున్న పర్లేదు కానీ.. సమాయానికి వస్తే చాలు అనే అనుకుంటారు ప్రయాణికులు.
ఈ క్రమంలో బాంద్రా నుంచి హరిద్వార్ వెళ్లాల్సిన రైలు బుధవారం రాత్రి 10:35కు రత్లాంకు చేరుకోవాలి. అయితే.. ఆ రైలు 20 నిమిషాల ముందుగా రత్లాంకు చేరుకుని అందరిని ఆశ్చర్య పరిచింది.
దీంతో ముందే వచ్చిన రైలును చూసి ప్రయాణికులు సంతోషం పట్టలేక ప్లాట్ఫారం మీదే ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. రైలులోని ప్రయాణికులకు కూడా 20 నిమిషాల సమయం దొరకడంతో అందరూ రైలు దిగి తమ ఆనందాన్ని డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేశారు.
ఆనందంతో అందరు కలిసి సంప్రదాయ గర్భా నృత్యంతో అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ ‘హ్యాపీ జర్నీ’ అని ట్యాగ్ చేస్తూ రాసుకొచ్చారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.