• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » కేసీఆర్ సభకు ఆర్టీసీ బస్సులు.. బస్టాండుల్లో జనం ఇక్కట్లు

కేసీఆర్ సభకు ఆర్టీసీ బస్సులు.. బస్టాండుల్లో జనం ఇక్కట్లు

Last Updated: January 18, 2023 at 1:12 pm

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చి.. మళ్లీ తిరిగి గమ్య స్థానాలకు చేరుకునే ప్రయాణికులకు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాలలోని కోరుట్ల, మహబూబాబాద్ లోని మరిపెడతో పాటు పలు బస్ స్టాండ్ లలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిపోల్లోని బస్సుల్లో దాదాపు అధిక శాతం ఖమ్మం బీఆర్ఎస్ సభకు వెళ్తుండటంతో.. ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోలో మొత్తం 39 బస్సులు ఉంటే అందులో 15 బస్సులు బీఆర్ఎస్ సభ కోసం వెళ్లాయి.

Provide concessions to senior citizens in RTC buses

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ బస్ స్టేషన్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం వెళ్లేందుకు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేని పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఉదయం నుంచి వెళ్లేందుకు బస్సులు లేవని, ఉన్న కొన్ని బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయని మండిపడుతున్నారు. బస్సులు సమయ పాలన పాటిస్తే బాగుంటుందన్నారు. బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోపాటు పంజాబ్‌, కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌ హాజరుకానున్నారు. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ బస్సుల ద్వారా జన సమీకరణ చేస్తోంది.

Primary Sidebar

తాజా వార్తలు

షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు.. కానీ..!

రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…!

పుతిన్ ను వ్యతిరేకిస్తూ పోస్టులు… యువతిని ఉగ్రవాదులు జాబితాలో చేర్చిన రష్యా…!

మంత్రి హరీష్ ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్

గవర్నర్ తమిళిసైతో ముగిసిన మంత్రుల సమావేశం

రాజ్‌ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి….!

వంద రూపాయలతో వచ్చి ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి….!

శాకుంతలంకు సమంతా ఈ రేంజ్ లో తీసుకుంటుందా…?

భారీ లాభాలు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే…!

మగాళ్ళకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, నటుడి సంచలన కామెంట్స్…!

నితిన్ – తేజా ఎందుకు మాట్లాడుకోవట్లేదు…?

‘ఆ అన్న చెల్లెళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఆడారు.. మోడీ చలవే మరి ‘

ఫిల్మ్ నగర్

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap