పాస్ పోర్ట్ సేవలను రెండో శనివారం కూడా యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటన విడుదల చేసారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్,బేగం పేట,టోలీ చౌకీ,కరీంనగర్, నిజామా బాద్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పాస్ పోర్ట్ ల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ విషయం గమనించాలని పేర్కొన్నారు.
తత్కాల్,సాధారణం పాస్ పోర్ట్ సేవలు రేపు అందుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ పరిధిలోని 14 పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి ఈ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తత్కాల్ కేటగిరీ కింద ప్రాసెసింగ్ అప్లికేషన్ సమర్పించడానికి అర్హత ఉన్న పత్రాల జాబితా కోసం దరఖాస్తు దారులు పాస్ పోర్ట్ సేవా పోర్టల్ ని చూడవలసిందిగా చెప్పారు. దరఖాస్తు దారులందరూ www.passportindia.gov.in పోర్టల్ ద్వారా లేదా mPassportseva యాప్ లో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
రెండో శనివారం అయిన రేపు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని అమీర్పేట్, బేగంపేట, టోలిచౌకీ, కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాల్లో సేవలు అందిస్తామని పేర్కొన్నారు.@rpohyderabad pic.twitter.com/9ohZlkk21K
— PIB in Telangana 🇮🇳#AmritMahotsav (@PIBHyderabad) December 9, 2022