• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » విదేశీ ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు తప్పనిసరి

విదేశీ ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు తప్పనిసరి

Last Updated: December 29, 2022 at 6:50 pm

చైనా సహా 5 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టులను కేంద్రం తప్పనిసరి చేసింది. చైనాతో బాటు హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికులు జనవరి 1 నుంచి విధిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ గురువారం వెల్లడించారు.

India makes negative RT-PCR mandatory for flyers from China, five other nations | Latest News India - Hindustan Times

. ఈ దేశాల్లో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయని, వీరు తమ ప్రయాణానికి ముందు తమ కోవిడ్ రిపోర్టులను ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్ లోడ్ చేయవలసి ఉంటుందని ఆయన చెప్పారు. ఇండియాలో కరోనా కేసులను అదుపు చేసేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

గత రెండు రోజుల్లో వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు 6 వేల ర్యాండమ్ టెస్టులు నిర్వహించగా.. 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కోవిడ్ పాజిటివ్ కి గురైనట్టు వెల్లడైందని మాండవీయ పేర్కొన్నారు. ఇకపై విదేశాలనుంచి ఎవరు ఇండియాకు వచ్చినా నెగెటివ్ కోవిడ్-19 టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

జనవరిలో మన దేశంలో కరోనా కేసులు పెరగవచ్చునని.. అయితే హాస్పిటలైజేషన్లు, మరణాలు తక్కువే ఉండవచ్చునని అంచనా వేశాయి. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏమైనప్పటికీ కరోనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, కేంద్రం ప్రకటించిన ప్రొటొకాల్స్ ని , గైడ్ లైన్స్ ని ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఈ వర్గాలు మరోసారి సూచించాయి. అప్రమత్తత అవసరం అని పేర్కొన్నాయి.

Primary Sidebar

తాజా వార్తలు

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టిక్కెట్ అడిగినందుకు కన్నబిడ్డను ఎయిర్ పోర్ట్లో వదిలేసిన జంట..!

పెళ్ళి వేడుకలో క్రాకర్స్ కోసం కొట్టుకున్నారు..!

జొమాటో గులాబ్ జామూన్స్ రేటు చాలా ఘాటు …!

విమానయాన పరిశ్రమ నష్టాల్లో ఉంది…!

5న కేబినెట్ సమావేశం…!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

శుక్రవారం నుంచి అరెస్టులే… సీఎం సంచలన ప్రకటన…!

ప్రకంపనలు రేపుతున్న రెండో ఛార్జ్ షీట్

టైగర్ టీ బ్రేక్ … వీడియో వైరల్ !

వీర సింహారెడ్డి సినిమా ఆ టీడీపీ లీడర్ స్పూర్తితో వచ్చిందా…?

రకుల్ కి ఆ సినిమా కలిసిరాలేదా…? అందుకే టాలీవుడ్ లో కనపడటం లేదా…?

ఫిల్మ్ నగర్

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

టాలీవుడ్ లో విషాదం.. కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

నటి పాకీజా, కెమెరా మేన్ దేవరాజ్ లకు చిరంజీవి ఆపన్న హస్తం..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap