• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

పెద్దిరెడ్డి డెయిరీ వ్యాపారం

Published on : September 16, 2020 at 4:58 pm

గనులను గుంజుకుంటున్నారు. ఇసుకను జుర్రుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా పశువులిచ్చే పాలనూ విడిచిపెట్టడం లేదని తెలిసింది. హెరిటేజ్ డెయిరీని తెచ్చి… చిత్తూరులో ప్రభుత్వ డెయిరీలను మూయించారని పదే పదే చంద్రబాబుపై జగన్ చేసే విమర్శ. ఈ విమర్శలో నిజముంది కూడా. కాని ఇప్పుడు తమరు చేస్తుందేంటి మహానుభావా అని అడగాల్సిన పరిస్ధితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనే జగన్ పాదయాత్రకు, తర్వాత ఎన్నికలకు ఫైనాన్సర్ అని చెబుతారు. అలాంటి పెద్దిరెడ్డి కుటుంబం శివశక్తి పాల డెయిరీని చిత్తూరు, కడప జిల్లాల్లో.. ఇంకా ఇతర రాయలసీమ ప్రాంతాల్లోనూ నడిపిస్తున్నారు.
ఇసుక మాఫియా పుణ్యమా అని.. పెద్దిరెడ్డి కుటుంబం.. చాలా చోట్ల బలపడింది.. కొత్తగా అనుచరులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. బలమున్న ప్రతి గ్రామంలోనూ రైతులెవరూ.. వేరే పాల కేంద్రానికి పోయటానికి లేదు.. వారంతా శివశక్తి పాల కేంద్రంలోనే పోయాలి. ఇది రూల్.. ప్రభుత్వ రూల్ కాదు.. అధికారపార్టీ వారి రూల్. అలా చాలా చోట్ల.. పాలను బలవంతంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. పాలు పోయకపోతే.. ఆ రైతుకు వేరే పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారని సమాచారం.

అసలు శివశక్తి పాల డెయిరీ గురించి మొదట చెప్పింది ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన చెప్పాకే.. అందరూ ఎంక్వయిరీ మొదలుపెట్టారు. అప్పుడు అందరికీ షాకిచ్చే నిజాలు బయటకొచ్చాయి. ఇతర పాల కేంద్రాలు అవి ప్రభుత్వపరమైనవైనా.. ప్రైవేటువైనా సరే.. మూసుకోవాల్సిందే.. చిత్తూరు, కడప జిల్లాల్లో శివశక్తి కేంద్రాలు మాత్రమే తెరిచి ఉంటాయి.. వాటికి మాత్రమే రైతులు పాలు పోయాలి. ఇవి ఆరోపణలు కాదు.. నిజాలు.. నిరూపిస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు సవాల్ విసురుతున్నారు.
ఇప్పటివరకు ఈ ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించలేదు. శివశక్తి డెయిరీ ప్రైవేటు లిమిటెడ్ లో డైరెక్టర్లుగా అంతా పెద్దిరెడ్డి కుటుంబీకులే ఉన్నారు. ఇది వారిదేనన్న సంగతి పాలు పోసేవారికి తెలుసు.. ఆయా ప్రాంతాల్లో ముఖ్యమైనవారందరికీ తెలుసు. కాకపోతే.. జగన్మోహన్ రెడ్డికి తెలుసా లేదా అన్నదే సస్పెన్స్. ఎందుకంటే ఇప్పటికీ అప్పుడప్పుడు హెరిటేజ్ పేరు చెబుతారు.. చిత్తూరు పోతే.. హెరిటేజ్ వలన.. ప్రభుత్వ డెయిరీ మూసేయాల్సి వచ్చిందని చెబుతారు. పైగా ఈ మధ్య ఆమూల్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కూడా ఈ విషయం చెప్పారు. పైగా తాము ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆమూల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని.. దాన్ని బట్టే తమ వైఖరి తెలుసుకోండని కూడా సెలవిచ్చారు.

మరి రాయలసీమలో పాల వ్యాపారం.. అది కూడా బెదిరించి పాలు పోయించుకుంటున్న శివశక్తి పాల డెయిరీ వ్యవహారంపై ఏమంటారో చూడాలి.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సరైన డేట్ ఫిక్స్ చేసుకున్న ఉప్పెన

సరైన డేట్ ఫిక్స్ చేసుకున్న ఉప్పెన

భారతీయుడు2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా ?

భారతీయుడు2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా ?

వ‌ర్మ మ‌రో మూవీ... ఈసారి ఎవ‌రిపై అంటే...?

వ‌ర్మ మ‌రో మూవీ… ఈసారి ఎవ‌రిపై అంటే…?

క్రేజీ ప్రాజెక్ట్ లో తాప్సి ?

క్రేజీ ప్రాజెక్ట్ లో తాప్సి ?

లూసిఫ‌ర్ కు ముహుర్తం ఫిక్స్

లూసిఫ‌ర్ కు ముహుర్తం ఫిక్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

పాస్ పోర్టు బ్రోక‌ర్ రాష్ట్రానికి సీఎం అయ్యారు- ఎంపీ అరవింద్

పాస్ పోర్టు బ్రోక‌ర్ రాష్ట్రానికి సీఎం అయ్యారు- ఎంపీ అరవింద్

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు

ఫిబ్ర‌వ‌రి 1 నుండి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు ఓపెన్

ఫిబ్ర‌వ‌రి 1 నుండి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు ఓపెన్

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టులో విచార‌ణ‌

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టులో విచార‌ణ‌

బెంగాల్ ఎన్నిక‌లు- కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మ‌మ‌త‌

బెంగాల్ ఎన్నిక‌లు- కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మ‌మ‌త‌

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎవ‌రో?

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎవ‌రో?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)