• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » పాక్ లో ఆకలి కేకలు .. గోధుమ పిండి ట్రక్కు వెంటే అన్నార్తులు

పాక్ లో ఆకలి కేకలు .. గోధుమ పిండి ట్రక్కు వెంటే అన్నార్తులు

Last Updated: January 15, 2023 at 4:59 pm

పాకిస్తాన్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆహార సంక్షోభం దేశాన్ని కుదిపి వేస్తోంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ కొండెక్కిపోతుండగా ఆహార కొరత పెరిగిపోతోంది. ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేయడంతో ప్రజలు ఆహారం కోసం ఘర్షణలకు దిగుతున్నారు. వంట గ్యాస్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. గ్యాస్ ని ప్రమాదకరంగా ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకువెళ్తున్న దృశ్యాలు వీడియోలకెక్కుతున్నాయి.

People chase wheat flour truck in Pakistan as hunger deepens

ఇటీవల లాహోర్ లో గోధుమపిండిని తీసుకువెళ్తున్న ట్రక్కు వెంట కొందరు పరుగులు తీస్తుండగా .. మరికొందరు బైక్ ల పైన వాహనాన్ని వెంటాడుతున్న వీడియోను జమ్మూ కశ్మీర్ కి చెందిన సజ్జాద్ రజా అనే ప్రొఫెసర్ షేర్ చేశారు. ఈయన జమ్మూ కశ్మీర్ గిల్గిట్ బాల్టిస్టాన్ అండ్ లడఖ్ నేషనల్ ఈక్వాలిటీ పార్టీ చైర్మన్ కూడా.. ‘ఇది మోటార్ సైకిల్ ర్యాలీ కాదని, గోధుమ పిండిని తీసుకువెళ్తున్న ట్రక్కు వెంట బైకులు నడుపుతూ ‘ఛేజ్’ చేస్తున్న అన్నార్తులని’ ఆయన అన్నారు. ‘కేవలం ఒక్క ప్యాకెట్ పిండి దొరికితే చాలని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీళ్ళు ఇలా ఆ వాహనం వెంట బడుతున్నారు. పాకిస్థాన్ లో అసలు భవితవ్యం అంటూ ఉందా ? ఆ దేశంలో ఏం జరుగుతోందో చూపడానికి ఈ చిన్న వీడియో చాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీర్ ప్రజలు కళ్ళు తెరవాలని, తాము పాకిస్తాన్ లో లేనందుకు అదృష్టవంతులమని పొంగిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియోలో కొందరు ఆ ట్రక్కుకు దగ్గరగా వచ్చి చేతిలో కరెన్సీ చూపుతూ తమకు పిండిని అమ్మాలని దీనంగా అభ్యర్థిస్తున్న దృశ్యం ఆ దేశంలోని పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. పరుగులు తీసినవారు, బైకులపై వచ్చిన వారితో ఆ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది.

పాకిస్తాన్ లో 15 కిలోల పిండి బస్తాను 2,050 రూపాయలకు అమ్ముతున్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే ఇది మొదట 150 రూపాయలకు,
ఆ తరువాత 300 రూపాయలు పెరిగిపోయింది. ఇలా అన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం 24.5 శాతానికి పెరిగింది. ఈ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు పాక్ ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తోంది. అయితే సైన్యానికి మాత్రం ప్రభుత్వం అత్యధిక బడ్జెట్ కేటాయిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.

Primary Sidebar

తాజా వార్తలు

షెడ్యూల్ ప్రకారమే సమావేశాలు.. కానీ..!

రైతు ఆత్మహత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు…!

పుతిన్ ను వ్యతిరేకిస్తూ పోస్టులు… యువతిని ఉగ్రవాదులు జాబితాలో చేర్చిన రష్యా…!

మంత్రి హరీష్ ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. కానీ ఫేక్ మినిస్టర్

గవర్నర్ తమిళిసైతో ముగిసిన మంత్రుల సమావేశం

రాజ్‌ భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి….!

వంద రూపాయలతో వచ్చి ఆసియాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి….!

శాకుంతలంకు సమంతా ఈ రేంజ్ లో తీసుకుంటుందా…?

భారీ లాభాలు వచ్చిన తెలుగు సినిమాలు ఇవే…!

మగాళ్ళకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, నటుడి సంచలన కామెంట్స్…!

నితిన్ – తేజా ఎందుకు మాట్లాడుకోవట్లేదు…?

‘ఆ అన్న చెల్లెళ్లిద్దరూ స్నో బాల్స్ తో ఆడారు.. మోడీ చలవే మరి ‘

ఫిల్మ్ నగర్

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నాని మూవీ టీజర్!

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

హాట్ బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

మరికొన్ని పరీక్షలు చేసిన తరువాతే స్పష్టత!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

స్టైలిష్‌ లుక్‌లో పవర్‌ స్టార్‌!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

మహేశ్‌ సినిమాలో నీలి కళ్ల సుందరి!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటున్న హీరోయిన్

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

బాహుబలిని కొట్టే సినిమా వస్తోందట!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap