• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

చెప్పినట్లే చేస్తున్న సీఎం కేసీఆర్

Published on : November 4, 2019 at 5:30 pm

టీఆర్ఎస్ ఇక నుండి ఫక్తు రాజకీయ పార్టీగా పనిచేస్తుంది అని కేసీఅర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రకటించారు. ఇకనుండి తమది ఉద్యమ పార్టీ కాదు అని తేల్చి చెప్పాడు. అది చాలామందికి తెలియక ఇంకా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అనుకుని కేసీఅర్ ఇలా చేస్తాడా, అలా చేస్తాడా ..ఉద్యమ పార్టీ అయి ఉండి ఇలా చేయడం అన్యాయం అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రజలలో ఇలాంటి భ్రమలు ఉంటాయనే తెలంగాణ రాగానే కేసీఅర్ మాది ఇకనుండి ఫక్తు రాజకీయ పార్టి అని ప్రకటించాడు. తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని భావించిన వర్గాలకు నిరాశే మిగిలింది అంటున్నారు. తెలంగాణ వచ్చాక ఎలా ఉండాలో ఏమి చేయాలో కేసీఅర్ కి క్లారిటీ ఉంది కాని ప్రజలకులేకపోవడమే సమస్య అంటున్నారు. కేసీఆర్‌ని ప్రజలు ఒకరకంగా ఊహిస్తే కేసీఆర్ మాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. దీంతో ప్రజలలో అసంతృప్తి నెలకొంటుంది అంటున్నారు. ఉద్యమకారులను పక్కనపెట్టి వివిధ పార్టీల నుండి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర పార్టీలలో గెలిచిన వారిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం, ఆందోళనలను అణచివేయడం, ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తివేయడం, విపక్షాలను లేకుండా చేయడం… ఎవరు తనకు ఎదురు చెప్పకూడదు అన్న ధోరణిలో వ్యవహరించడం, విమర్శలను సహించకపోవడం స్వీకరించకపోవడం నిరంకుశంగా వ్యవహరించడం చూసి ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.

మేము ఊహించిన కేసీఆర్ కి మేము చూస్తున్న కేసీఆర్ కి పోలికే లేదు అంటున్నారు. ఇందుకోసమే అయితే తెలంగాణ వచ్చిన రాకపోయినా ఒకటే అంటున్నారు. తెలంగాణ వస్తే ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మారతాయి అనుకున్నాం సామాజిక న్యాయం జరుగుతుంది అనుకున్నాం… కాని అవేమీ జరగడంలేదు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు. కీలక పదవులు వారి వారికే కట్టబెడుతున్నారు అని తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. దీంతో అన్ రెస్ట్ ఏర్పడుతుంది అంటున్నారు.

అటు సొంత పార్టీ క్యాడర్ లో ఇటు ఉద్యమకారులలో ప్రజలలో కూడా ఇది కనపడుతుంది. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె సందర్భంగా కూడా కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు కార్మికులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నాడు సకలజనుల సమ్మెకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనే స్వయంగా సమ్మెను నడిపించాడు. ఇప్పుడు సమ్మెలే వద్దు అంటున్నాడు. నాడు ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ పెట్టించిన కేసీఅర్ ఇప్పుడు యూనియన్ వద్దు అంటున్నాడు. ఉద్యమ సమయంలో కార్మికులకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అన్న కేసీఅర్ ఇప్పుడు కార్మికులు చనిపోతున్నా… చలిచడంలేదు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

కార్మికులు కేసీఆర్ ని ఇంకా ఉద్యమ నాయకుడి గా చూస్తున్నారని అంటున్నారు. అయన దళితుడిని సీఎం చేస్తాను అని చేయనప్పుడు అందరికీ అర్థంకావాలి కాని ప్రజలు ఇంకా భ్రమలు పెట్టుకోవడం వలనే వారిలో అసహనం పెరుగుతుంది అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా కేసీఅర్ మీద ఆశలు పెట్టుకొని చివరికి సమ్మెకు దిగేసరికి కేసీఅర్ అసలు స్వరూపం బయటపడింది. దీనితో కార్మికులు మనోధైర్యం కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం లేదా గుండే పగిలి చావడం జరుగుతుంది అని విశ్లేషిస్తున్నారు. కేసీఅర్ తెలంగాణ రాగానే ఇకనుండి నేను ఉద్యమ నాయకుడిని కాదు మా పార్టీ ఉద్యమ పార్టీ కాదు అని తేల్చి చెప్పాడు కాని ప్రజలు మాత్రం ఆయన మీద భ్రమలు పెంచుకొని మోసపోయారు అంటున్నారు.

ఇప్పటికైనా ప్రజలు కేసీఅర్ తెలంగాణ రాగానే చేసిన ప్రకటనను అర్దం చేసుకొని నడుచుకోవాలని బ్రమలను తొలగించుకోవాలని అంటున్నారు. లేకపోతే అనవసరంగా నష్టపోతారు అని హితవు చెప్తున్నారు. కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నాడు, స్పష్టత లేనిది ప్రజలకే అని సెటైర్స్ వేస్తున్నారు

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఈ నలుగురు నా కెప్టెన్స్...మెగాస్టార్

ఈ నలుగురు నా కెప్టెన్స్…మెగాస్టార్

కాంబో అదుర్స్...! కానీ పట్టాలెక్కుతుందా ?

కాంబో అదుర్స్…! కానీ పట్టాలెక్కుతుందా ?

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఆర్.ఆర్.ఆర్

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

బంగారు బుల్లోడు రిలీజ్ డౌటేనా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

అయోధ్య రామమందిరానికి పవన్ విరాళం ఎంతో తెలుసా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

కేసీఆర్ నీ కోట గోడను బద్దలుకొడతాం

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

అఖిల‌ప్రియ‌కు బెయిల్- భ‌ర్త భార్గ‌వ్ రామ్ కు నో

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఆ ముగ్గురు అధికారుల‌ను ఉన్న ఫ‌లంగా త‌ప్పించండి- స‌ర్కార్ కు నిమ్మ‌గ‌డ్డ ఆదేశం

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో మ‌ళ్లీ న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాలు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుప‌త్రికి చేరుకుంటున్న కుటుంబ స‌భ్యులు

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

ఒక్క ఫొటోతో ప్రియురాలి పెళ్లి గోవిందా !! ప్రియుడు హ్యాపీ..

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)