• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

Published on : October 5, 2019 at 7:34 pm

గోదావరిలో బోటు ప్రమాదం వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు గుమ్మం తొక్కింది. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇందులో వాటాలు వున్నాయని సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్ దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

రాజమహేంద్రవరం: ప్రమాదం జరిగిన బోటుతో పాటు అంతుచిక్కని మృతదేహాలనూ వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పార్లమెంట్ మాజీ సభ్యుడు హర్షకుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని, బోటు వెలికితీతపై నిర్లక్ష్యం చేస్తున్నారని హర్షకుమార్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినట్టు సమాచారం.  Supreme-Court

కొద్దిరోజుల క్రితం హర్షకుమార్ బోటు ప్రమాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదని ఆయన ప్రధానంగా చేస్తున్న అభియోగం. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి గల్లంతైనప్పుడు పడ్డ బాధేంటో ముఖ్యమంత్రి జగన్‌కు తెలుసు. ఇప్పుడు బోటు ప్రమాద బాధితుల బాధను సీయం కూడా అర్థం చేసుకోవాలి. పుష్కరాల్లో 28మంది చనిపోతే అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడు బోటు ఘటనపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అని హర్షకుమార్ సూటిగా ప్రశ్నించారు.

దీనిపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది. మరోవైపు బోటు ప్రమాద మృతుల సంఖ్యను ఎక్కువ చేసి చెప్పి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించారని హర్షకుమార్‌పై కేసు నమోదు అయింది. హర్షకుమార్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. తర్వాత హర్షకుమార్ కనిపించలేదు. హర్షకుమార్ తప్పించుకోవడానికి సహకరించారనే కారణంతో రాజమండ్రి త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబును పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారని వార్తలొచ్చాయి.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

నాగ శౌర్యకు హిట్ ఇచ్చిన దర్శకుడికి రామ్ నో చెప్పాడట ?

నాగ శౌర్యకు హిట్ ఇచ్చిన దర్శకుడికి రామ్ నో చెప్పాడట ?

అనసూయ కోసం వెంకీ ...థాంక్ యూ బ్ర‌ద‌ర్ ట్రైలర్ రిలీజ్

అనసూయ కోసం వెంకీ …థాంక్ యూ బ్ర‌ద‌ర్ ట్రైలర్ రిలీజ్

పాపం....తాప్సి కష్టాలు !!

పాపం….తాప్సి కష్టాలు !!

ఓటీటీ లోనే సైనా నెహ్వాల్ బయోపిక్ ?

ఓటీటీ లోనే సైనా నెహ్వాల్ బయోపిక్ ?

పూరీ చాయిస్...మోక్షజ్ఞ లేక పవన్ కళ్యాణా ?

పూరీ చాయిస్…మోక్షజ్ఞ లేక పవన్ కళ్యాణా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

చ‌దువు చెప్పే గురువుల‌కే పంగ‌నామాలా?

చ‌దువు చెప్పే గురువుల‌కే పంగ‌నామాలా?

ప్ర‌ధాన విప‌క్షాల‌న్ని బాయ్‌కాట్.. టీఆర్ఎస్ మాత్రం గ‌ప్‌చుప్‌!

ప్ర‌ధాన విప‌క్షాల‌న్ని బాయ్‌కాట్.. టీఆర్ఎస్ మాత్రం గ‌ప్‌చుప్‌!

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అయోధ్య మ‌సీదుకు విరాళాలివ్వొద్దు.. అస‌దుద్దీన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం - ప్రతిపక్షాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం – ప్రతిపక్షాలు

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

నేను దేశ ద్రోహిని ఎలా అవుతాను.. ఢిల్లీ అల్ల‌ర్ల‌పై దీప్ సిద్ధూ

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)