• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » నాడు పచ్చ..నేడు గులాబీ.. మిగతా కబ్జా అంతా..సేమ్ టూ సేమ్! ఫినిక్స్ భూఫిక్సింగ్ పార్ట్-2

నాడు పచ్చ..నేడు గులాబీ.. మిగతా కబ్జా అంతా..సేమ్ టూ సేమ్! ఫినిక్స్ భూఫిక్సింగ్ పార్ట్-2

Last Updated: November 19, 2021 at 7:21 pm

– ఫినిక్స్ భూఫిక్సింగ్ కి ఎప్పుడో స్కెచ్
– 90వ దశకంలోనే కన్నేసిన పచ్చబ్యాచ్
– ఆనాడు పదిలక్షలకే పందేరాలు
– నేడు పదివేల కోట్లు..గులాబీలు వదిలేస్తారా!
– ధరణి ప్రకారం 137 ఎకరాలు సర్కార్ దే!
– తొలివెలుగు పరిశోధనాత్మక కథనం

అది 90వ దశకం.చంద్రబాబు నాయుడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు.హైటెక్ సిటీకి శంఖుస్థాపన చేశారు.గుట్టలను తవ్వుకుంటూ రోడ్లు వేస్తున్నారు.గుట్టల్లో దండిగా ప్రభుత్వభూమి,అసైన్డ్ ల్యాండ్.ఎవ్వరికి దొచినంత, చూసినంత భూమి తమదే అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు.ఆ కాలంలో చెప్పాలంటే సైబర్ టవర్ కి చాలా దూరంగానే..సర్వే నెంబర్స్35,37,40,42 నుంచి 47 మరియు 53తో పాటు ఇంకా ప్రభుత్వ భూమి ఉంది.

మహాదేవి కో-ఆపరేటివ్ హౌజింగ్ సోసైటీ మాయాజాలం

ఈ ప్రభుత్వ భూమిని దక్కించుకోవాలనే ఉపాయంతో మహాదేవి కో-అపరేటివ్ సొసైటి తెరపైకి వచ్చింది.డాక్యుమెంట్ నెంబర్లు 1564/1996 నుంచి 1585/1996 వరకు ఒకే రోజున రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఖానామెట్ శివయ్యతో పాటు మరో 46మంది దళితుల కుటుంబాల నుంచి వేణుగోపాల్ రెడ్డి,తరుణ్ జోషీల పేర్ల మీద మహాదేవి కో-అపరేటివ్ హౌజింగ్ సొసైటికి 20 రిజిస్ట్రేషన్స్ చేయించారు.అయితే అందులో భూమి విస్తరణ ఎంత, హద్దులు ఎవరెవరివి అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.వారికి ఉన్నభూమిని అమ్మినట్లు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. 1998లో 5ఎకరాల 13 గుంటల భూమిని విస్తరణతో పాటు రిజిస్ట్రేషన్ హద్దులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ మరోసారి చేయించుకున్నారు.ఈ రెండేళ్ల వ్యవధిలో ఆ దళితులు మరికొంత మందికి ఎకరాల చొప్పున అమ్మకం జరిపారు.ఇక సొసైటీ రూల్స్ పాటించకపోవడమా..లేదా ప్రభుత్వ భూమి అని తెలిసో కాని మహాదేవి కో-ఆపరేటీవ్ హౌజింగ్ సొసైటీ కాస్తా ప్రయివేట్ లిమిటెడ్ గా మారిపోయింది.820/1999నుంచి 837/1999 వరకు మళ్లీ రిజిస్ట్రేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపనీకి చేశారు.

కష్టోపా కార్పోరేషన్ కి సర్వె నెంబర్ 35,36

గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో కష్టోపా కార్పోరేషన్ విచ్చలవిడి అమ్మకాలు జరిపింది.సర్వే నెంబర్ 35లో అనిల్ కుమార్ కామ్ దార్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నసమయంలోఎస్.పటేల్,రూసెన్ పటేల్,పి.ఏ.పటేల్,రూపన్ పటేల్,సోనాల్ పటేల్స్ కి అమ్మకం జరిపారు.సర్వేనెంబర్ 36లో వివిధ బిజినెస్ పీపుల్ కి అమ్మకం జరిపారు.ఆ బిజినెస్ పీపుల్ అటు టీడీపీలోను,ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోను చక్రం తిప్పిన వారే..అర్బన్ సిలింగ్ యాక్ట్ ప్రకారం మిగులుభూమి అంతా ప్రభుత్వ భూమి అని 1971 నుంచి రికార్డుల్లో ఉంది.కాని వివిధ సొసైటీ పేర్ల మీదుగా,ప్రయివేట్ లిమిటెడ్ కంపనీలకు,బిజినెస్ పీపుల్ చేతిలోకి రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇదంతా అప్పటి నాయకులు 10 లక్షలు పంచుకుని రిజిస్ట్రేషన్స్ చేయించారని ఆరోపణలు.

ప్రభుత్వ భూమిలో మరిన్ని సొసైటీల బాగోతాలు

సాయి అశ్వికా ప్రాపర్టీస్,సాయి నిహారిక ప్రాపర్టీస్,సాయి అనన్య ప్రాపర్టీస్,కృష్ణార్జున ప్రాపర్టీస్ పేర్లతో ప్రభుత్వభూముల్లో ప్లాట్స్ చేసి అమ్ముకున్నారు.విక్రయించిన ప్లాట్స్ ఏమయ్యాయి.కోర్టుల్లో కేసులు ఏంటి.. చివరికి ఎవరికి చేరాయి.రికార్డుల్లో తన పేరుతో సహా ఉండి..చక్రం తిప్పిన ఏ.పి.మంత్రి ఎవరు..?పచ్చపార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎలా భూములు వచ్చాయి.ఆ తర్వాత వై.ఎస్.ఆర్.సి.పి నేతలతో గులాబీ నేతల దోస్తానం ఎవరికి కలిసి వచ్చిందో పార్ట్ -3 లో ఇన్వెస్టిగేషన్ కథనంలో చూద్దాం.

https://tolivelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Video-2021-11-19-at-6.36.02-PM.mp4
tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

టెట్ ప‌రీక్ష వాయిదా వేయాలి..!

సారుకు.. అంత సీన్‌ ఉందా?

సైలెంట్‌గా కేసీఆర్ పావులు..కానీ ఇతర పార్టీల నేతలు కలిసి వస్తారా?

ఐదు రోజుల టెస్టు… నేడు మూడో రోజు..!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

అప్పుడు ఎన్టీఆర్ ను కాదన్నవారే తరువాత దేవుడన్నారు!

తెలంగాణ ‘కీర్తి’ ఈ ఐఏఎస్ అధికారిణి..ప్రజలకు అండగా అడుగులు

దేశం తలదించుకునే పని ఎప్పుడూ చేయలేదు

ఉక్రెయిన్ కు కాదు.. మన పిల్లల భద్రతపై దృష్టిపెట్టండి

కుటుంబపాలన పోవాలి.. తెలంగాణకు విముక్తి కావాలి!

హోటల్ లో మంటలు.. లోపల సిబ్బంది అవస్థలు!

విమర్శలపాలవుతున్న కేసీఆర్..పర్యటనలతో ప్రజాధనం వృథా!

ఫిల్మ్ నగర్

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వర్మ..ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

udaykiran

చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ స్టార్ డైరెక్టర్స్ తో ఏం మాట్లాడాడో తెలుసా ?

F3 Movie Review and Rating

ఫస్ట్ ఆఫ్ ఓకే…సెకండ్ ఆఫ్ కష్టం – రివ్యూ

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)