• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మ‌మ‌తా బెన‌ర్జీపై దాడి.. కుట్రే?

Published on : March 10, 2021 at 8:26 pm

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జ‌రిగింది. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తాను కారు వద్ద నిల‌బ‌డి ఉన్న స‌మ‌యంలో.. న‌లుగురైదుగురు వ్యక్తులు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా త‌నను గ‌ట్టిగా తోసివేశార‌ని, దీంతో త‌న‌కు కాలుకు గాయ‌మైన‌ట్టు మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పారు. ఈ సంఘ‌ట‌న వెనుక క‌చ్చితంగా కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్య‌క్తం చేశారు. త‌న‌పై దాడి జ‌రిగిన స‌మ‌యంలో ఆప్ర‌దేశంలో పోలీసులెవ్వ‌రూ లేర‌ని ఆమె ఆరోపించారు. దాడికి ముందు నాలుగైదు గంట‌ల ముందు నుంచే పోలీసులు ఎవ‌రూ త‌నకు ద‌గ్గ‌ర‌గా క‌నిపించ‌లేదని ఆమె చెప్పారు ఈ ఘ‌ట‌న‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. కాగా గాయపడిన మమత బెన‌ర్జీని చికిత్స కోసం తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు వెంట‌నే కోల్‌క‌తాకు త‌ర‌లించారు.

నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో పాటు, ప్ర‌చారం నిర్వ‌హించేందుకు మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి నందిగ్రామ్ వ‌చ్చారు. ఓ ఆల‌యంలో పూజ‌ల అనంత‌రం నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం వ‌ర‌కూ ఆమె నందిగ్రామ్‌ నియోజకవర్గంలోనే ఉండాల్సి ఉంది. కానీ దాడి కార‌ణంగా అర్ధాంత‌రంగా త‌న ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని వెళ్లారు.

#WATCH:"Not even one Police official was present. 4-5 people intentionally manhandled me in presence of public. No local police present during program not even SP. It was definitely a conspiracy. There were no police officials for 4-5 hrs in such huge public gathering" says WB CM pic.twitter.com/wJ9FbL96nX

— ANI (@ANI) March 10, 2021

మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్ స్పందించారు. ఈ విష‌యంపై తానేం మాట్లాడ‌బోన‌న్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను చాలా సార్లు క‌వ‌ర్ చేసి ఉంటార‌ని.. విష‌యం ఏమిటో మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంద‌ని రిపోర్ట‌ర్ల‌ను ఉద్దేశించి అన్నారు. దీదీలో ఓట‌మి క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని..ఇలాంటి మాట‌లు, చ‌ర్య‌లు ఓడిపోయే పార్టీ, ఓడిపోయే అభ్యర్థికి సంకేతాల‌ని చెప్పారు. మ‌మ‌తా బెన‌ర్జీ నందిగ్రామ్‌లో.. తృణ‌మూల్ కాంగ్రెస్ ప‌శ్చిమ బెంగాల్‌లో ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మమ‌తా బెన‌ర్జీపై దాడికి సంంధించి త‌మ‌కు ఫిర్యాదు అందిన‌ట్టు ఎన్నిక‌ల సంఘం తెలిపింది.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

ఏప్రిల్ 30న ఓటీటీలో 'సుల్తాన్'!

ఏప్రిల్ 30న ఓటీటీలో ‘సుల్తాన్’!

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి 'రాధే'

థియేట‌ర్లు, ఆన్‌లైన్‌లో ఒకేసారి ‘రాధే’

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు...?

సూర్య డైరెక్ట‌ర్ తో మ‌హేష్ బాబు…?

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

భారీ బ‌డ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ దూకుడు

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

కెరీర్ బెస్ట్ డీల్ తో బాల‌య్య

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

క‌రోనా తీన్మార్.. మూడో రూపంలోకి వైర‌స్!

క‌రోనా తీన్మార్.. మూడో రూపంలోకి వైర‌స్!

ఆరోగ్యంగా కేసీఆర్.. త్వ‌ర‌లో విధుల‌కు!

ఆరోగ్యంగా కేసీఆర్.. త్వ‌ర‌లో విధుల‌కు!

వ్యాక్సిన్ వేసుకుంటే లాభ‌మేంటి.. స‌మాధాన‌మిదే!

వ్యాక్సిన్ వేసుకుంటే లాభ‌మేంటి.. స‌మాధాన‌మిదే!

నేడు క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖులు.. ఎవ‌రంటే?

నేడు క‌రోనా బారిన‌ప‌డ్డ ప్ర‌ముఖులు.. ఎవ‌రంటే?

క‌రోనా ఎఫెక్ట్- ఓయూ డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ప్రమోట్

క‌రోనా ఎఫెక్ట్- ఓయూ డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ప్రమోట్

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

య‌శోద ఆస్ప‌త్రికి కేసీఆర్!

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)