అమెరికాలోని క్యాపిటల్ భవనంలో ప్రస్తుత ఆధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారుల ఆందోళనతో నెలకొన్న పరిస్థితులపై వివిధ దేశాధినేతలు స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. వాషింగ్టన్లో అల్లర్లు, హింసాత్మక చర్యల గురించి వస్తున్న వార్తలు ఆవేదనను కలిగిస్తున్నాయని అన్నారు. అధికార బదిలీ క్రమబద్ధంగా, శాంతియుతంగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. చట్టవిరుద్ధమైన చర్యలతో ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేసేందుకు ప్రయత్నించడాన్ని సమర్థించలేమని ట్వీట్ చేశారు.
మరోవైపు జోబైడెన్ ఎన్నిక గుర్తింపు సమావేశం మళ్లీ ప్రారంభమైంది. జాతీయ రక్షణ బలగాలు క్యాపిటల్ భవనాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే వాషింగ్టన్లో 15 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావదొద్దని ఆదేశించారు.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021