• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ‘గిరిజనుల సంక్షేమం నా ధ్యేయం’.. మోడీ

‘గిరిజనుల సంక్షేమం నా ధ్యేయం’.. మోడీ

Last Updated: February 16, 2023 at 4:07 pm

 

గిరిజనుల సంక్షేమం తన వ్యక్తిగత ధ్యేయమని, ఇది తన సెంటిమెంటుతో ముడిపడి ఉందని ప్రధాని మోడీ అన్నారు. సామాన్య పౌర జీవనానికి సుదూరంగా ఉన్న ఆదివాసీలు, గిరిజనులను కూడా నగరాలకు దగ్గర చేయడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన చెప్పారు. గిరిజన సంస్కృతిని హైలైట్ చేసేందుకు ఢిల్లీలో గురువారం నిర్వహించిన ‘ఆది మహోత్సవ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 21 వ శతాబ్దంలో ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న మంత్రంపై ఈ దేశం నడుస్తోందన్నారు. ఈ సందర్భంగా గిరిజన స్వాతంత్య్ర సమర యోధుడు బిర్సా ముండాకు ఆయన ఘనంగా నివాళి అర్పించారు.

 

PM Modi Inaugurates 'Aadi Mahotsav' In Delhi, Calls For Increased  'Recognition Of Tribal Products'

గత తొమ్మిదేళ్లలో ఆది మహోత్సవ్ వంటి కార్యక్రమాలు ఈ దేశానికి ప్రచారంగా మాత్రమే ఉపయోగపడుతూ వచ్చాయని, అలాంటి పలు ఈవెంట్లలో తాను పాల్గొన్నానని చెప్పిన ఆయన.. ఇప్పుడు గిరిజన సంక్షేమమన్నది తన వ్యక్తిగత సెంటిమెంటుతో ముడిపడినదిగా మారిందన్నారు. ఇదివరకటి ప్రభుత్వాలు వెదురును నరకడం, దాన్ని వినియోగాన్ని లీగల్ గా బ్యాన్ చేశాయని, కానీ తాము వెదురును గడ్డి కేటగిరీలో చేర్చి దీనిపై ఇదివరకున్న అన్ని నిషేధాలను ఎత్తివేశామని మోడీ చెప్పారు. బ్యాంబూతో చేసిన ఉత్పత్తులన్నీ పెద్ద పరిశ్రమలో భాగమయ్యాయన్నారు.

ఆదివాసీలు, గిరిజనులు తయారు చేసిన సాంప్రదాయక వస్తువులకు డిమాండ్ పెరిగిందని, ఈశాన్య రాష్ట్రాల్లో తయారైన ఇలాంటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో .. గిరిజనులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను సుమారు 200 స్టాల్స్ లో ప్రదర్శించారు.

ఈ మహోత్సవ్ లో దాదాపు వెయ్యి మంది గిరిజన హస్తకళాకారులు పాల్గొంటున్నారు. ఈ నెల 16 నుంచి 27 వరకు ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. గురువారం మోడీ ఈ స్టాల్స్ ను సందర్శించి కొన్ని ఉత్పత్తుల వివరాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.. దీన్ని మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ గా అభివర్ణిస్తున్నారు.

 

Primary Sidebar

తాజా వార్తలు

డేటా చోరీ కేసు: రంగంలోకి దిగిన ఆర్మీ

పెళ్లి కోసం పెరోల్‌ పై వచ్చిన యువకుడు..తాళి కట్టి మళ్లీ జైలుకి!

మంత్రి సురేష్ కు తృటిలో తప్పిన ప్రమాదం!

ఢిల్లీలో కాంగ్రెస్ సామూహిక సత్యాగ్రహం

పిల్లల అనారోగ్యాలు చూడలేక..సాఫ్ట్‌వేర్‌ కుటుంబం ఆత్మహత్య!

తిరుపతి ఘాట్ రోడ్డులో చిరుత హల్ చల్!

తెలుగు వారియర్స్‌ కి నాలుగోసారి కప్‌!

సల్మాన్‌ నాయికగా పూజా!

బీఆర్ఎస్ భారీ సభ.. కేసీఆర్ స్పీచ్ పై ఉత్కంఠ!

ఎన్టీఆర్‌ 30 సినిమాకు హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్!

నింగిలోకి ఎల్వీఎం- 3 రాకెట్‌!

ఐఐటీల్లో కుల వివక్ష? విద్యాసంస్థల్లోనూ అదే పోకడ

ఫిల్మ్ నగర్

ccl 2023 telugu warriors akhil team won the title

తెలుగు వారియర్స్‌ కి నాలుగోసారి కప్‌!

has salman khan replaced kareena kapoor in bajarangi bhaijaan sequel with pooja hegde

సల్మాన్‌ నాయికగా పూజా!

action stunt choreographer kenny bates joins jr ntr 30

ఎన్టీఆర్‌ 30 సినిమాకు హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్!

సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకున్న ఆషిఖీ -2 బ్యూటీ ..!

సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకున్న ఆషిఖీ -2 బ్యూటీ ..!

SSMB28 టైటిల్ కి సైతం  ‘అ’ సెంటిమెంట్ రిపీట్ చేసిన త్రివిక్రమ్..!?

SSMB28 టైటిల్ కి సైతం ‘అ’ సెంటిమెంట్ రిపీట్ చేసిన త్రివిక్రమ్..!?

రెండో పెళ్ళి  వదంతిపై  మండిపడిన మీనా...!

రెండో పెళ్ళి వదంతిపై మండిపడిన మీనా…!

అడ్వాన్స్డ్ హ్యాపీబర్త్ డే టూ యూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ...! : RC15 టీమ్

అడ్వాన్స్డ్ హ్యాపీబర్త్ డే టూ యూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ …! : RC15 టీమ్

‘నాటునాటు’ పాటకు ఆస్కార్ వస్తుందనుకోలేదు...అదంత గొప్పపాటేమీ కాదు..!?

‘నాటునాటు’ పాటకు ఆస్కార్ వస్తుందనుకోలేదు…అదంత గొప్పపాటేమీ కాదు..!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap