గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీయుల నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోడీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్కు లేఖ రాశారు మోడీ.
భారతదేశ మిత్రులైన మీకు, మరికొందరికి నేనీ లేఖ రాస్తున్నాను. భారత్ పట్ల మీ అనుబంధం, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా దేశం, మా ప్రజలతో మీరిలాగే కలిసి పనిచేస్తారని నా విశ్వాసం. కొన్నేళ్లుగా మీరు భారతదేశం, ఇక్కడి సంస్కృతి పట్ల ప్రేమ పెంచుకొన్నారు. ఈ జాతి పేరును ప్రతిబింబించేలా ఇండియా అని మీ కుమార్తెకు పేరు పెట్టడం మీ ఇష్టాన్ని తెలియజేస్తోంది.
Thank you @narendramodi ji for the very kind words. I have indeed grown so much as an individual on every visit to India. My whole family celebrates #RepublicDay with all of India, honouring the importance of a #Constitution that protects the rights of the Indian people #JaiHind pic.twitter.com/olovZ8Pgvn
— Jonty Rhodes (@JontyRhodes8) January 26, 2022
మీరు నిజంగా మా దేశానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్. మన దేశాల మధ్య ఇలాగే సత్సంబంధాలు కొనసాగాలి. మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మిమ్మల్ని కలిసి మాట్లాడేందుకు ఎదురు చూస్తుంటాను అంటూ మోదీ లేఖలో పేర్కొన్నారు.
ఇక ఇదే విషయమై జాంటి రోడ్స్ స్పందిస్తూ నరేంద్ర మోదీజీ.. ప్రేమపూర్వక మీ మాటలకు ధన్యవాదాలు. భారతదేశానికి వచ్చిన ప్రతిసారీ వ్యక్తిగా నేనెంతో ఎదిగాను. భారతీయులు అందరితో పాటు మా కుటుంబం అంతా గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. భారతీయుల హక్కులను కాపాడుతున్న రాజ్యాంగాన్ని మేమెంతో గౌరవిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు.