• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. 144 లోక్ సభ సీట్లలో మోడీ ర్యాలీలు ?

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. 144 లోక్ సభ సీట్లలో మోడీ ర్యాలీలు ?

Last Updated: October 9, 2022 at 4:53 pm

2024 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఇక కదన రంగంలోకి దూకనున్నట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయమే ధ్యేయంగా ఆయన దేశ వ్యాప్త సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో తాము సీట్లు కోల్పోయిన.. లేదా బీజేపీ బలహీనంగా ఉన్న 144 లోక్ సభ సీట్లలో జరిగే దాదాపు 40 ర్యాలీల్లో మోడీ పాల్గొనవచ్చునని అంటున్నారు.

మిగిలిన 104 స్థానాల్లో పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా, హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ప్రవాస్ యోజన రెండో దశ కింద ఆయా రాష్ట్రాల్లోని నగరాలు, జిల్లాలు, పట్టణాల్లో బీజేపీకి చెందిన స్థానిక అసంతృప్త నాయకులను బుజ్జగించడం, వారితోను, భావ సారూప్యత కలిగిన నేతలతోను వరుసగా సమావేశాలు నిర్వహించడం వంటివి పార్టీ వ్యూహంలో భాగంగా ఉన్నాయి.

పైగా పార్టీ మంత్రులు అయిదు అంశాల క్యాంపెయిన్ ప్లాన్ అమలు గురించి ప్రజలకు వివరించాలని, ఇందులో పొలిటికల్ మేనేజ్మెంట్ తో బాటు తమకు నిర్దేశించిన క్లస్టర్ కి సంబంధించి తమ లోక్ సభ నియోజకవర్గంలో ఓ రాత్రి ఉండి ప్రజలతో మమేకం కావడంలాంటివి కూడా ఉన్నాయి.

స్థానిక మత నాయకులను, వివిధ వర్గాల నేతలను కలుసుకోవడమే కాకుండా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు వంటి వివిధ వృత్తుల వారితో కూడా ప్రత్యక్షంగా, వర్చ్యువల్ గా మీటింగులు ఏర్పాటు చేయడం ఈ బడా స్ట్రాటిజీలో భాగమని పార్టీ వర్గాలు వివరించాయి. అవసరాన్ని బట్టి మరిన్ని ప్రతిపాదనలను ఈ వ్యూహంలో చేర్చనున్నట్టు తెలుస్తోంది. మంత్రులే కాకుండా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా తగిన బాధ్యతలను అప్పగించే సూచనలున్నాయని తెలుస్తోంది.

Primary Sidebar

తాజా వార్తలు

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

కోదండరామ్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హరిత హారంలో పెంచిన 150 మొక్కలను నరికేశాడు…!

నగరంలో ఐపీఎల్ ఫీవర్.. క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ లు

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ప్రజలకు మరో షాక్.. సైలెంట్ గా చార్జీలు పెంచేసిన టీఎస్ఆర్టీసీ

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

ఫిల్మ్ నగర్

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ....ఎంతో తెలుసా.... !?

పుష్ప-2 ఓటీటీ రైట్స్ కి బేరం షురూ….ఎంతో తెలుసా…. !?

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

నేను నటనవైపు రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్...వీడియో వైరల్ ..!

‘’ఎన్టీఆర్ 30” సెట్స్ లోకి ఎంటరైన ఎన్టీఆర్…వీడియో వైరల్ ..!

ఫ్యామిలీతో  సమ్మర్   వెకేషన్ కి   వెళ్ళిన  పవన్ ...!

ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కి వెళ్ళిన పవన్ …!

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

రజనీకాంత్ కూతురి పిసినారి తనాన్ని 18 ఏళ్లుగా చూస్తున్నా..! : పనిమనిషి

ktr-happy-to-rrr-oscar-winning-.jpg

సినిమాల్లో తెలంగాణ యాస‌.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఇది కలెక్షన్ల “దసరా’... తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

ఇది కలెక్షన్ల “దసరా’… తెరకెక్కించిన తీరును ప్రసంసిస్తున్న ప్రముఖులు..!

దీపిక అటు ...రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్...!?

దీపిక అటు …రణవీర్ ఇటు ఇద్దరి మధ్యా ఎనీ ఇష్యూస్…!?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap