• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » రెండు రాష్ట్రాల్లో మోడీ పర్యటన.. ప్రాజెక్టుల ‘బొనాంజా’ !

రెండు రాష్ట్రాల్లో మోడీ పర్యటన.. ప్రాజెక్టుల ‘బొనాంజా’ !

Last Updated: January 19, 2023 at 11:44 am

ప్రధాని మోడీ గురువారం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను విజిట్ చేయనున్నారు. దాదాపు 38,800 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా, హస్తినలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వ అధికార పగ్గాలను చేబట్టే ధ్యేయంగా ఆయన సాగనున్నారు. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ ఇప్పటినుంచే తమ పార్టీ విజయాలకు పునాది వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం మోడీ పర్యటనను పురస్కరించుకుని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయనకు స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

PM Modi Karnataka Maharashtra visit traffic diversions mumbai metro lines surat chennai expressway live updates | India News – India TV

మొదట కర్ణాటకను సందర్శించనున్న ఆయన.. కలబుర్గి, యాద్గిర్ జిల్లాలను విజిట్ చేసి ఇరిగేషన్, మంచినీరు, జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను లాంచ్ చేస్తారు. జల్ జీవన్ మిషన్ కింద యాద్గిర్ జిల్లా కోడేకల్ లో 2,050 కోట్ల వ్యయమయ్యే వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయనున్నారని, దీనివల్ల సుమారు 2.3 లక్షల ఇళ్లకు మంచినీటి సౌకర్యం కలుగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కలబుర్గి, యాద్గిర్, బీజాపూర్ జిల్లాల్లో 4,700 కోట్ల ఖర్చు కాగల వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలు చేయనున్నారని పేర్కొంది.

సూరత్-చెన్నై ఎక్స్ ప్రెస్ వే లో భాగంగా ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని, ఇందుకు 2,100 కోట్లు వ్యయమవుతుందని వివరించింది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఆరు రాష్ట్రాలగుండా సాగుతుంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, తమిళనాడును ఇది కలుపుతుంది. దీనివల్ల ప్రస్తుతమున్న రూట్ 1600 కి.మీ. నుంచి 1270 కి.మీ.కు తగ్గుతుంది. ఇక మహారాష్ట్రలో సైతం మోడీ చేతుల మీదుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.

సాయంత్రం ముంబై చేరుకోనున్న ఆయన.. 12,600 కోట్లు వ్యయమయ్యే ముంబై మెట్రో లైన్లు 2 ఏ, 7 ను ప్రారంభించి దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. 2015 లో ఆయన ఈ లైన్లకు శంకుస్థాపన చేశారు. ముంబై 1 మొబైల్ యాప్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును మోడీ లాంచ్ చేయనున్నారు. ఈ యాప్ వల్ల ప్రయాణం సుఖవంతమవుతుందని, మెట్రో స్టేషన్ల ఎంట్రీ గేట్ల వద్ద వీటిని ప్రజలు చూపవచ్చునని, యూపీఐ ద్వారా టికెట్ల కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చునని తెలిసింది. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని ముఖ్యంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. అనేక రోడ్డు మార్గాలను మూసివేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.

Primary Sidebar

తాజా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు.. హిమాన్షుపై ప్రశంసలు..!

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap