• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » సిరిసిల్ల నేతన్నపై ప్రధాని ప్రశంసలు

సిరిసిల్ల నేతన్నపై ప్రధాని ప్రశంసలు

Last Updated: November 27, 2022 at 3:28 pm

డిసెంబర్ 1 నుంచి జీ-20 సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించనుంది భారత్. అయితే.. మన్ కీ బాత్ లో భాగంగా ఈ సదస్సుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. ముఖ్యంగా తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడి గురించి ప్రస్తావించారు. ఆ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సిరిసిల్లకు చెందిన చేనేత కళకారుడు హరిప్రసాద్ ఈమధ్య ప్రధాని మోడీకి ఓ గిఫ్ట్ పంపారు. జీ-20 సదస్సుకు సంబంధించిన లోగోను తన స్వహస్తాలతో నేసి పంపించారు. దాంతోపాటు మోడీకి ఓ లేఖ కూడా రాశారు హరిప్రసాద్. దీని గురించే మన్ కీ బాత్ లో ప్రస్తావించారు ప్రధాని. ఆ అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.

హరిప్రసాద్ కళ అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉందని కొనియాడారు ప్రధాని. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో ప్రస్తావించారని వివరించారు.

మన్ కీ బాత్ లో హరిప్రసాద్ గురించి మోడీ మాటల్లో..

‘‘మిత్రులారా.. నేను ఒక ప్రత్యేకమైన బహుమతిని సూచిస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన సొంత చేతులతో నేసిన జీ -20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ జీ తన కళలో ఎంతో నిష్ణాతులు. ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తారు. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు హరిప్రసాద్ జీ నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని అందులో రాశారు. దేశం సాధించిన ఈ విజయం ఆనందం మధ్య, అతను తన సొంత చేతులతో జీ-20కి సంబంధించిన లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుంచి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈరోజు పూర్తి మక్కువతో దానిలో నిమగ్నమై ఉన్నారు’’

Primary Sidebar

తాజా వార్తలు

ఇద్దరు అబ్బాయిలు పెళ్ళి చేసుకుంటామని కోర్టుకెక్కారు..!

సుప్రీంకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు

హైదరాబాద్ కి ముంచుకొస్తున్న హై టెంపరేచర్…!

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేసీఆర్‭ కు చివరి ఎన్నికలు ఇవే..!

కేటీఆర్ అబద్దాలను కూడా వినసొంపుగా చెప్పారు!

ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు!

ఉద్యమకారులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు

గట్టు బాగు చేయడానికి పెట్టిన నిప్పు… ముప్పుతెచ్చింది.!

ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..!

తుంగతుర్తిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా!

ఫిల్మ్ నగర్

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap