-ప్రకటించిన ప్రధాని మోడీ
-జాబితాలో తెలంగాణ పేరు
ఏడు రాష్ట్రాల్లో పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్,యూపీల్లో ఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు 5ఎఫ్ (ఫార్మ్ నుండి ఫైబర్ నుంచి ఫ్యాక్టరీ నుండి ఫ్యాషన్ నుండి ఫారిన్ వరకు) దృష్టికి అనుగుణంగా టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో ఈ పార్కులు ఏర్పాటు కానున్నాయని వెల్లడించడానికి సంతోషపడుతున్నానన్నారు.
పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు టెక్స్టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని వివరించారు. కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తూ లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆయన చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ , ‘మేక్ ఫర్ ది వరల్డ్’కి ఇది గొప్ప ఉదాహరణని అన్నారు.
పీఎల్ఐ కింద టెక్స్టైల్స్ పరిశ్రమలో ఇప్పటివరకు సుమారు రూ. 1,536 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు జౌళి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆత్మనిర్భర్ ప్రణాళికలో భాగంగా, భారతీయ తయారీదారులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎగుమతులను మెరుగుపరచడానికి, భారత్ ను ప్రపంచ సప్లై చైన్లో చేర్చేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వివిధ రంగాలలో ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలను ప్రారంభించింది.