బుద్ధిగా డ్యూటీ చేసుకుంటున్న కానిస్టేబుల్, ఒక మహిళను నమ్మి నిలువునా మోసపోయాడు. చేసిన అప్పు మెడకు చుట్టుకోవడంతో కుటుంబాన్ని గాలికి వదిలేసి మాయమయ్యాడు.
నంద్యాల జిల్లా బేతంచెర్లలో కోర్టు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సోమ్లా నాయక్ కనిపించకుండా పోయిన సంఘటన పోలీస్ వర్గంలో కలకలం రేపుతోంది. అతని భార్య, కుటుంబసభ్యులు డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఓ నోట్ రాసిపెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్ సోమ్లా నాయక్.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక మహిళను నమ్మి అప్పులు చేసినట్టు అందులో క్లియర్గా రాసిపెట్టాడు. మహిళను నమ్మి రెండు కోట్లు మోసపోయానని.. తన కుటుంబానికి ఎస్పీ న్యాయం చేయాలంటూ దానిలో అభ్యర్థించారు.
చేతిలో ఉన్న సొమ్ముతో పాటు.. బ్యాంక్ లోన్లు తీసుకుని మరీ రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అప్పుల వాళ్ళ ఒత్తిడి పెరగడం..పెట్టుబడి నుంచి రిటన్స్ రాకపోవడంతో తాను మహిళను నమ్మి మోసపోయానని గ్రహించిన సోమ్లా నాయక్.. ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
ఎటుపోయాడు, ఏమైపోయాడని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న నంద్యాల జిల్లా పోలీసులు.. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.