తెలంగాణా ప్రభుత్వం సరికొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ ని క్లిక్ చేసి బుక్ అయ్యాడు ఓ ఫోటోగ్రాఫర్. న్యూ సెక్రటేరియట్ను ఫోటో తీస్తున్నాడంటూ ఆ ఫోటోగ్రాఫర్ పై పోలీసులు దాడి చేశారు. అంతటితో ఆగక అతని నుంచి కెమోరా సైతం లాక్కున్నారు పోలీసులు.
రోడ్డుపై నిలబడి సెక్రటేరియట్ ఫోటో తీస్తుంటే అడ్డుకోవడం ఏంటని ఫోటోగ్రాఫర్ అడిగిన పోలీసులు పట్టించుకోలేదు. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ ను ఏప్రిల్ 30న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతి వనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు.
నిజానికి పాత సెక్రటేరియట్ కూల్చివేత నుంచి కొత్త సెక్రటేరియట్ నిర్మాణం వరకు అంతా నిర్భందంలోనే కొనసాగుతోంది. ఓ వైపు పోలీసుల బందోబస్త్ , మరోవైపు ప్రైవేటు సెక్యూరిటీ పెట్టి నిర్మాణ పపనులు కొనసాగిస్తున్నారు.
అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన.. అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభ తేదీపై అధికారులతో చర్చించారు.మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా. అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.