బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి ఇటీవల భద్రతను పెంచిన సంగతి తెలిసిందే. 1+5 రోప్ టీమ్ ఏర్పాటు చేసి అదనంగా ఎస్కార్ట్ వాహనాన్నికూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బండికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అధికార్లు నివేదిక ఇవ్వడంతో భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు కానీ శుక్రవారం బండి కి భద్రత తగ్గించారు.
భద్రతను పెంచిన రెండు రోజులకే దానిని ఉపసంహరించుకోవడంతో టీఆర్ ఎస్ ప్రభుత్వం ఒత్తిడితోనే భద్రతను తగ్గించినట్లు బండి వర్గీయులు, పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాగా ఇటీవల కరీంనగర్ లో హనుమన్ జయంతి సందర్భంగా బండి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల తర్వాత సంజయ్ కి ప్రాణ హాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా హెచ్చరించాయి. దాంతో ప్రభుత్వం రెండు రోజుల క్రితం భద్రత పెంచి వెంటనే తగ్గించడంపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి.