• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Scrolling » కష్టాల్లో ప్రజలు… చేరికల బిజీలో నేతలు!

కష్టాల్లో ప్రజలు… చేరికల బిజీలో నేతలు!

Last Updated: July 30, 2022 at 8:20 pm

– ప్రజలను పట్టించుకోకుండా రాజకీయాలు
– ఢిల్లీ సారు బిజీ.. జాయినింగ్స్ పై ప్రతిపక్షాలు బిజీ
– నాయకుల తీరుపై ప్రజల ఆగ్రహం
– ఇవెక్కడి పాలిటిక్స్ అంటూ నిరసన స్వరం

తెలంగాణ ప్రజలు వరద కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు చేసినట్టు కనిపించడం లేదు. ప్రజలకు వరద సహాయం కింద రూ. 10వేలు ఇస్తామని మొక్కుబడిగా ప్రకటన చేసిందే గానీ.. ఆ దిశగా చర్యలు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సహాయం చాలా ప్రాంతాల్లో అందలేదు. వరదలు, వర్షాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రజలకు సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి వెళ్లి ఢిల్లీలో తిష్ట వేశారని ప్రజలు అంటున్నారు. ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆయనకు జాతీయ రాజకీయాలు కావాల్సి వచ్చిందా అంటూ పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు సైతం వరద బాధితుల కష్టాలను పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. మరో ఏడాది తర్వాత జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్రణాళికలు రచించే బిజీలో ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పనై పోయిందని, టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనేది తామేనంటూ బీజేపీ చెబుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏ నేతలు తమ పార్టీలోకి వస్తారు, ఎవరిని ఎలా చేర్చుకోవాలనే బిజీలో కమలం పార్టీ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీల నుంచి అసమ్మతి నేతలను చేర్చుకునే విషయంలో బిజీగా కనిపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు తమ పాత్రను సమర్థవంతంగా పోషించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో రాజకీయాలను పక్కన బెట్టి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పంపాలి. విపక్షాలు ప్రజల్లో మనోధైర్యం కలిగించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. కానీ.. ఇవేవి పట్టనట్టు అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటిన పాదయాత్ర

కోదండరాంతో కాంగ్రెస్ చర్చలు ఎందుకు?

ఉపాధ్యాయులు లేకుండా చేయాలని వైసీపీ ప్లాన్​.. నాదెండ్ల మనోహర్

ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు …!

రాజీనామా వార్తలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి క్లారిటీ

మనీలాండరింగ్​ కేసులో దోషిగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

ధ్యానంతో ప్రశాంతం.. శ్రీరామచంద్ర సంస్థ ఉచిత శిక్షణ!

రూ. 500 విషయంలో గొడవ… స్నేహితుడి తలను కత్తితో నరికి…!

అడుగ‌డుగున‌.. అడ్డంకులు..సొమ్మ‌సిల్లిన భ‌ట్టి!!

బిగ్ బాస్ సీజన్ 6 క్రేజీ అప్ డేట్

సంక్షేమంపై కేసీఆర్​కు సోయి లేదు!

ఆ నిర్ణయాన్ని సమర్థించుకున్న విదేశాంగ మంత్రి…!

ఫిల్మ్ నగర్

మనీలాండరింగ్​ కేసులో దోషిగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

మనీలాండరింగ్​ కేసులో దోషిగా జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌

డర్టీ పిక్చర్ సీక్వెల్.. స్మిత పాత్రలో నటించేది ఎవరో...!

డర్టీ పిక్చర్ సీక్వెల్.. స్మిత పాత్రలో నటించేది ఎవరో…!

అత‌నంటే ఇష్టం: అన‌న్య పాండే

అత‌నంటే ఇష్టం: అన‌న్య పాండే

మ‌హాన‌టిగా ఆమెను వ‌ద్ద‌న్నాను!!

మ‌హాన‌టిగా ఆమెను వ‌ద్ద‌న్నాను!!

ఎట్టి ప‌రిస్థితుల్లో అత‌నితో సినిమాలు చేయ‌ను!!

ఎట్టి ప‌రిస్థితుల్లో అత‌నితో సినిమాలు చేయ‌ను!!

నా జాస్మిన్ ఆనందంగా క‌నిపించ‌డం లేదు!!

నా జాస్మిన్ ఆనందంగా క‌నిపించ‌డం లేదు!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)