అన్న మాటలకు, చేసిన వ్యాఖ్యలకు ఫలితంగానే రాహుల్ గాంధీ తన ఎంపీ పదవికి అనర్హునిగా అయ్యారు. కానీ ఈ అంశం గురించి నిరసనలు , దీక్షల పేరుతో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ అన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. డిస్ క్వాలిఫై విషయంలో పై స్థాయి కోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నా రాహుల్ వెళ్లను అని చెప్పి ఇప్పుడు ఈ అంశాన్ని రాజకీయం చేసి సింపతీ పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు కనీసం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ కనమరుగవుతోందని, గ్రౌండ్ స్థాయిలో వీక్ అవుతోందని, అందుకే ఈ స్టంట్ కు దిగారన్నారు అదానీ పేరుతో ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఇతర పార్టీలను కూడా వెంటపెట్టుకుని బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారన్నారు. వాళ్లు ఎన్ని ధర్నాలు, నిరసనలు చేసినా ప్రజలు వారిని పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయాడని, ఆయనకు అంత ఓపిక కూడా లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇది రాహుల్ గాంధీ మైండ్ సెట్ కు నిదర్శనంగా ఆయన చెప్పుకొచ్చారు.