పొన్నాల లక్ష్మయ్య.. మాజీ పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నేత
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయాలు వేడెక్కితే పర్వాలేదు. కానీ.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వ నాయకులు వాస్తవాలను వాస్తవాలుగా సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీ బండారం బయటపెడతానని కేసీఆర్ అన్నారు. మోడీ అవినీతి చిట్టాని బయటపెడతానని అంటున్న కేసీఆర్.. అంతకుముందు రోజు జరిగిన బహిరంగ సభలో ఎందుకు మాట్లాడలేదు. ఈ వాస్తవాలను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎందుకు బయట పెట్టడం లేదు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డి లు.. కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉందని చెప్తున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్ కొనుగోలు అన్నిటిలో అవినీతి ఉందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎనిమిది ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటున్నా బీజేపీ నేతలు రాష్ట్ర సీఎం కేసీఆర్ అవినీతి చిట్టాను ఎందుకు దాస్తున్నారు. అవినీతి చిట్టాను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడానికి.. ప్రజా వ్యతిరేక చట్టాలు చర్చల్లో లేకుండా ఆమోదముద్ర వేసుకోవడానికి.. బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న తీరు స్పష్టంగా అర్థం అవుతుంది.
సీఎం కేసీఆర్ పై 2014 ఏప్రిల్ 14న సీబీఐ కోర్టు చార్జీషీట్ వెయ్యమని చెప్పింది కదా.. వేశారా?. కేంద్ర ప్రభుత్వ ఈడీ అధికారులు వచ్చి ప్రశ్నించిన మాట వాస్తవం కాదా కేసీఆర్..? దేశంలో బీజేపీ ప్రతిష్ట దిగజారుతోందనే నేపథ్యంలో కాంగ్రెస్.., ఇతర పక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందనే ఆలోచనతో తమ ఉనికిని కాపాడుకునేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను ముందుకు తీసుకొచ్చింది. కేంద్రంలో ఉన్న మంత్రులు, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి జరిగిందని చెప్తుంటే.. కేంద్ర సంస్థలు అయిన సీబీఐ స్వచ్ఛందంగా ఈ కేసును తీసుకోకూడదా?. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ప్రభుత్వానికి కొమ్ము కాయాలా..?
కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే సీబీఐ ద్వారా ఎంక్వైరీ వేయించాలి. రాష్ట్ర సీఎం కేసీఆర్ కు దమ్ముంటే మోడీ అవినీతి చిట్టాను బయట పెట్టాలి. కేసీఆర్.. నీ మీద ఏ విధంగా అయితే కేసులు ఉన్నాయో.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులపైన అవినీతి కేసులు పెట్టండి. భయం దేనికి కేసీఆర్.. ప్రజలకు అన్నీ తెలుసు. మీ నాటకాలను కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ప్రజల ముందుకు తీసుకెళ్తొంది. ఒక ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న మంత్రులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే.. సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
నేను రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తాను. ఈ రకమైన కార్యక్రమాలను దేశంలో ఎన్నికల కోసం.. ప్రజల్ని మోసం చేయడం కోసం.. అధికారం చేపట్టడం కోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులపైన కూడా కేసులు పెట్టలేదా..? ఆరోపణలన్నీ కొట్టివేయ బడలేదా..? కేసీఆర్ సారు.. ఇక మీ డ్రామాలు కట్టిపెట్టండి. మీకు రోజులు దగ్గర పడ్డాయి. మోడీ గారు ఇప్పటివరకు చేసింది చాలు. అవినీతిని అరికట్టడానికి చేసే ప్రయత్నంలో మీ ధర్మ కర్తవ్యాన్ని ఆచరిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలి.