పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
గత 15 రోజులుగా ఢిల్లీ కేంద్రం గా ఎముకలు కొరికే చలి లో రైతులు నిరసన చేస్తున్నారు.డిసెంబర్8 రైతులకు మద్దతుగా భారత్ బంద్ లో టీఆరెస్ కూడా పాల్గొంది. కేసీఆర్ పార్లమెంట్ సభ్యులను పిలుచుకొని ఢిల్లీ రైతులకు మద్దతు గా కలిసి దీక్ష శిబిరం లో పాల్గొనాలి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ నాయకులు కేసీఆర్ అవినీతి మీద మాట్లాడారు. ఇవాళ ఢిల్లీ లో సీఎం పర్యటన లో రహస్యం ఏంటో చెప్పాలి. మీరు కేంద్రమంత్రులు కలిసినప్పుడు ఆ శాఖ అధికారులు ఎందుకు లేరు.. మీ ఎంపీ లు ఎక్కడున్నారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ అమిత్ షా కు సాష్టాంగా నమస్కారం చేస్తున్నారు. ఎన్నికల్లో తిట్టుకొని ఇప్పుడు రహస్య మంతనాలు చేస్తున్నాడు వాటిని ప్రజలు గమనించాలి. కేసీఆర్, అమిత్ షా, మోదీ ,ఓవైసీ అంత ఒకటే. ఢిల్లీ పై పోరాటం చేస్తా అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ బీజేపీ నేతలను కలుస్తున్నారు..
దేశంలో ఏ పార్టీ పైన అయిన సీబీఐ ,ఈడీ కేసులు చేస్తున్న బీజేపీ కేసీఆర్ పై ఈగ కూడా వాలనివ్వడం లేదు..కేసీఆర్ అవినీతి పైన ఎందుకు విచారణ జరిపిస్తలేరు. వరదసాయం ఆడిగేతే దాని అంచనా ఏది. అధికారులను ఎందుకు తీసుకుపోలేదు. మీరు వేయమంటేనే సన్న వడ్లు రైతులు వేశారు. బీజేపీ బెదిరింపులకు భయపడే ఢిల్లీ వెళ్లావు.
తెలంగాణ ప్రయోజనాల కోసం అని కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ మీ పోరాటానికి అండగా ఉంటుంది. కానీ ఓ రహస్య ఎజెండా తో రాజకీయ లబ్ది కోసమే ఢిల్లీ వెళ్లారు.