పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఢిల్లీ కేంద్రంగా .. వ్యవసాయ వ్యతిరేక బిల్లు లపై రైతులు పోరాటం చేస్తున్నారు. రైతుల పోరాటానికి తెలంగాణ కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలుపుతోంది. రైతులపై చేసిన లాఠీచార్జి ను తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల కు అప్పగించేందుకు బీజేపీ పనిచేస్తోంది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెప్పారని సన్న ధాన్యం వేశారు.. ఈ రోజు కొనే పరిస్థితి లేదు.
ప్రతీ గింజను కొనే వరకు కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే.. అసద్ లెటర్ రాస్తే చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెబుతున్నారు. ఆ మాటలు దేనికి సంకేతం. మీ ఎంపీ , రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చెస్తామంటూన్నారు. ప్రతీ రాజకీయ పార్టీ నేతలపై కేంద్ర సంస్థలు రైడ్స్ చేస్తుంటే.. కేసీఆర్ మీద ఎందుకు చేయడం లేదు.