రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ కాంబోలో వస్తున్న లైగర్ సినిమా.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ మూవీ తర్వాత మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు పూరి అండ్ విజయ్. జనగణమన అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు పూరి. అలాగే ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా అలరించనుందని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలను నిజం చేస్తూ జనగణమన సినిమాలో హీరోయిన్ పూజ అని ప్రకటించారు చిత్రయూనిట్.
ఈ మేరకు పూజ హెగ్డే కు వెల్కమ్ చేప్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు పూరి. ఈ వీడియోలో మూవీ మేకింగ్ చూపిస్తూనే ఛార్మి, పూరి కలిసి పూజాహెగ్డే కు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. అక్కడ విజయ్, పూజాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వనుంది టీమ్.
ఈ సినిమాను పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛార్మి కౌర్, దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో 2023 ఆగస్టు 3న ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
కాగా ‘లైగర్’ మూవీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్ట్ 25న విడుదల కానుంది. అదేవిధంగా విజయ్ దేవకొండ సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఇక వరస సినిమాలతో విజయ్ ఫుల్ బిజీగా గడపనున్నారు.