గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ శ్రీధరన్.. ఆయన చేత ప్రమాణం చేయించారు. గోవాలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రమోద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాయకులు హాజరయ్యారు. ప్రమాణం అనంతరం గవర్నర్, ప్రధానితో పాటు పలువురు ప్రమోద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Congratulations to @DrPramodPSawant Ji and all others who took oath in Goa today. I am confident this entire team will deliver good governance to the people of Goa and build on the pro-people work done in the last decade. pic.twitter.com/s5zMyjPyVt
— Narendra Modi (@narendramodi) March 28, 2022
Advertisements
ఇటు కేబినెట్ మంత్రులుగా మౌవిన్ గోదిన్హో, విశ్వజిత్ రాణే, రావి నాయక్, సుభాష్ శిరోధ్కర్, నైలేష్ కాబ్రల్, రోహన్ కౌంటే, అటాన్షియో మాన్సెరేట్, గోవింద్, గౌడే ప్రమాణస్వీకారం చేశారు.
40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమోద్ సావంత్ నేతృత్వంలో బీజేపీ 20 సీట్లు సాధించింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు పలువురు మద్దతు పలకగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ప్రమోద్.
మంగళవారం నూతన శాసనసభ రెండు రోజుల సమావేశం అయ్యేందుకు గవర్నర్ శ్రీధరన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశాల్లో ప్రమోద్ సావంత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు.