మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డీప్ కోమాలో ఉన్నారని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ తెలిపింది. ప్రణబ్ ఇంకా కోమాలోనే కొనసాగుతున్నారని.. వెంటిలెటర్ సాయం పొందుతున్నట్లు వెల్లడించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకడంతో అందుకు సంబంధించిన చికిత్స అందజేస్తున్నట్టు పేర్కొంది. నిన్న ఆయన రెనల్ పెరామీటర్స్ స్వల్పంగా క్రమం తప్పినట్టుగా వివరించింది.ఈమేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ప్రణబ్ ఆర్మీ హాస్పిటల్లో ఈ నెల 10న చేరారు. అక్కడే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. ఆప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.