• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » ఏపీలో మోటార్లకు మీటర్లపై మంత్రి వేముల కామెంట్స్ వైరల్

ఏపీలో మోటార్లకు మీటర్లపై మంత్రి వేముల కామెంట్స్ వైరల్

Last Updated: May 14, 2022 at 2:48 pm

ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టడంపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చే రూ.5 వేల కోట్ల రుణ పరిమితికి ఆశపడి ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని మంత్రి విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏపీలో వచ్చే 6 నెలల్లో విద్యుత్ మీటర్లు పెట్టడం పూర్తి చేస్తామని అక్కడి మంత్రి అంటున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఆశ చూపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో ఒప్పుకోలేదన్నారు. రూ.5 వేల కోట్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ రైతులే తనకు ముఖ్యమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పినట్లు మంత్రి వివరించారు.

అలాగే, పాలమూరుకు నీళ్లు రాకుండా కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని మంత్రి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌లు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెప్పించాలని డిమాండ్ చేశారు.

ఇక వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది. ‘రూ.5 వేల కోట్ల అప్పు కోసం, రైతుల మెడకు జగన్ రెడ్డి ఎలా ఉరితాడు వేసాడో, పక్క రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు వినండి. చంద్రబాబు గారు ఇదే చెప్తుంటే విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు, ఇప్పుడేమంటారు..?’ అంటూ టీడీపీ ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షం టీడీపీతో పాటు మిగిలిన విపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి.

రూ.5 వేల కోట్ల అప్పు కోసం, రైతుల మెడకు జగన్ రెడ్డి ఎలా ఉరితాడు వేసాడో, పక్క రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు వినండి. చంద్రబాబు గారు ఇదే చెప్తుంటే విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు, ఇప్పుడేమంటారు ? pic.twitter.com/whx8mykC3x

— Telugu Desam Party (@JaiTDP) May 13, 2022

Primary Sidebar

తాజా వార్తలు

ఇంకా ఏ కాలంలో ఉన్నాం మనం..జాతి పేరు చెప్పి..!

అంగరంగ వైభవంగా జరిగిన భద్రాద్రి రాములోరి కళ్యాణం!

అనుష్క బొద్దుగా మారడానికి కారణం అదేనా?

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శరత్ బాబు!

స్పష్టమైన గేమ్ ప్లాన్ ఉంటే ఒత్తిడి దరిచేరదు!

ఎన్నో కార్లు కొని అమ్మేశాను..ఎందుకంటే!

రాహుల్ గాంధీపై కేసు వేస్తా.. లలిత్ మోడీ హెచ్చరిక…!

వరల్డ్ బ్యాంకు చీఫ్‌గా భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా..!

పీఎస్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది!

ఊరేగింపుగా కల్యాణ మండపానికి చేరుకున్న సీతారాములు.. కాసేపట్లో కల్యాణం!

మంత్రం కన్నా గొప్పది నీ నామం..అంటూ!

పడగ విప్పుతున్న కరోనా…!

ఫిల్మ్ నగర్

అనుష్క బొద్దుగా మారడానికి కారణం అదేనా?

అనుష్క బొద్దుగా మారడానికి కారణం అదేనా?

senior actor sarat babu hospitalised at chennai

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన శరత్ బాబు!

ps2 trailer out

పీఎస్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది!

prabhas latest movie adipurush special poster released on ram navami

మంత్రం కన్నా గొప్పది నీ నామం..అంటూ!

మేటరున్న టీజర్ గా ‘మీటర్’ … హిట్ కొట్టనున్న కిరణ్ అబ్బ’వరం’..!

మేటరున్న టీజర్ గా ‘మీటర్’ … హిట్ కొట్టనున్న కిరణ్ అబ్బ’వరం’..!

డిసెంబర్ 22 న ‘సైంధవ్’గా ఫుల్ యాక్షన్ మీల్స్ పెట్టనున్న వెంకీమామ..!

డిసెంబర్ 22 న ‘సైంధవ్’గా ఫుల్ యాక్షన్ మీల్స్ పెట్టనున్న వెంకీమామ..!

బిజినెస్ వుమెన్ గా మారిన సమంత…!?

బిజినెస్ వుమెన్ గా మారిన సమంత…!?

రామ్ చరణ్ కు పుట్టినరోజు కానుకిచ్చిన రాజమౌళి కుటుంబం..!

రామ్ చరణ్ కు పుట్టినరోజు కానుకిచ్చిన రాజమౌళి కుటుంబం..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap