కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న సరికొత్త చిత్రం షూటింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 2, 2023 నుంచే షూటింగ్ పనుల్లో బిజీఅయ్యింది చిత్ర బృదం.
మాస్టర్, వారసుడు వంటి బ్లాక్బస్టర్ విజయాల తర్వాత మూడవసారి విజయ్తో కలిసి 7 స్క్రీన్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దళపతి 67’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్సిచేసారు. ‘’మాస్టర్’ తో మాసీవ్ సక్సెస్ అందుకున్న విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.
ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా, జగదీష్ పళనిసామి సహ నిర్మాత. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో భాగం అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. “దలపతి67 వన్ లైనర్ విన్నప్పుడే ఈ చిత్రంలో భాగం అవుతానని తెలుసు. ఈ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు చాలా థ్రిల్గా వుంది’’ అన్నారు సంజయ్ దత్.
ఈ సినిమాలో ప్రియా ఆనంద్ కూడా ఈ చిత్రంలో భాగం కానుంది. “దలపతి 67లో భాగమైనందుకు థ్రిల్గా ఉంది. ఇటువంటి అద్భుతమైన తారాగణం, టీంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను! ” అన్నారు ప్రియా ఆనంద్. ప్రియాఆనంద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. లీడర్ సినిమాతో ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను పలకరించారు .
కత్తి, మాస్టర్, బీస్ట్ చిత్రాలతోచార్ట్ బస్టర్ ఆల్బమ్లను అందించిన రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్..‘దలపతి 67’ కోసం నాల్గవ సారి విజయ్ తో కలసి పని చేస్తున్నారు. విజయ్ రీసెంట్ గా వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.