డర్టీ హరి పేరుతో చాలా బోల్డ్గా మరో మూవీ రానుంది. శత్రువు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఎం ఎస్ రాజు చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. బాలచందర్, పుట్టన్న కనగల్ వంటి దర్శకులు అప్పట్లో చాలా బోల్డ్గా సినిమాలు తీసినా… బ్యూటిఫుల్గా, క్లాసికల్ ఉండేవి. వాటి స్పూర్తితోనే ఎం ఎస్ రాజు ఈ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.
ఎస్.పి.జి క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి హీరోగా పరిచయం అవుతుండగా, రుహిని శర్మ, సిమత్ర కౌర్లు హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఎం ఎస్ రాజు చిత్రం కావటంతో… సినిమాపై మంచి అంచనాలుండగా, అతి త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.