[sonaar_audioplayer artwork_id=”” feed=”https://tolivelugu.com/wp-content/uploads/2022/01/Nv-prasad.mp3″ player_layout=”skin_float_tracklist” hide_progressbar=”default” display_control_artwork=”false” hide_artwork=”false” show_playlist=”false” show_track_market=”false” show_album_market=”false” hide_timeline=”false”][/sonaar_audioplayer]
ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ టికెట్స్ వివాదం పై స్పందించారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. కొవ్వూరులో ప్రసన్న కూమార్ రెడ్డి అంటే ఏంటో అందరికి తెలుసు. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉంది.అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చుకోవద్దుని అన్నారు ఎన్వీ ప్రసాద్.
వంద అడుగులు పైనుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుంది. మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరు. బలిసి కొట్టుకుంటోంది మీరే.
ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదని అన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడండి.నా సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానిస్తా అంటూ చెప్పుకొచ్చారు ఎన్వీ ప్రసాద్.