వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్ మార్కెట్లు ఒక్క సారీగా మంగళవారం లాభాల బాట పట్టాయి. వివిధ రంగాలకు చెందిన షేర్లు కాస్త కోలుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా బిగ్బుల్ రాకేశ్ ఝున్.. ఝున్ వాలాపై కాసులు వర్షం కురిసింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే తాను పెట్టుబడి పెట్టిన రెండు కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి.
దీంతో ఏకంగా రూ. 186 కోట్లు వచ్చి పడ్డాయి. ఆ రెండు కంపెనీలు.. టాటా గ్రూప్ కు చెందినవి కావడం విశేషం. వాటిలో ఒకటి టాటా మోటార్స్ కాగా.. మరొకటి టైటాన్. సోమవారం ఎన్ఎస్ఈ సెషన్ క్లోజింగ్ నాటికి రూ.2,398 ఉన్న టైటాన్ షేర్ విలువ మార్కెట్ ఓపెనింగ్ సెషన్ లో రూ. 23.95 పెరిగి.. రూ.2,435 లకు చేరింది.
ఇదే విధంగా టాటా మోటార్స్ షేర్ కూడా రూ. 4.70 పెరిగి.. రూ.476.15కి చేరింది. దీంతో కేవలం పదే నిమిషాల్లో రూ. 186 కోట్ల ఝున్ ఝున్వాలా పోర్ట్ ఫోలియోలో వచ్చి చేరాయి.
టైటాన్ లో రాకేశ్ కు 3,37,60,395 షేర్లు ఉండగా ఆయన సతీమణి రేఖా ఝున్ ఝున్ వాలా 95,40,575 షేర్లు కొనుగోలు చేశారు. వీరిద్దరికీ కలిపి మొత్తం 4,33,00,970 షేర్లు ఉన్నాయి. టాటా మోటార్స్ లో రాకేశ్ కు 3,67,50,000 షేర్లు ఉన్నాయి.